Rashi khanna accepted green india challenge: ఆ స్టార్ హీరోయిన్లకు రాశీ ఖన్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్!

Rashi khanna accepted green india challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Update: 2020-07-20 15:11 GMT
rashi khanna accepted green india challenge

Rashi khanna accepted green india challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగానే సినీ హీరోయిన్ రష్మీక మందన్నా మొక్కలు నాటి మరో హీరోయిన్ రాశీఖన్నా ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన రాశీఖన్నా మూడు మొక్కలు నాటారు.

షేక్‌పేటలోని జేఎంఆర్ వైట్ లోటస్‌లో ఉన్న తన నివాసం లోని ఆవరణలో ఆమె సోమవారం మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని అన్నారు. ఇందులో తనని కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని, ఇలా చేయడం వలన భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని రాశీఖన్నా అన్నారు.

ఇక తన అభిమానులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వయంగా స్వీకరించి దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నాలను రాశీ ఖన్నా నామినేట్ చేశారు. తన ఛాలెంజ్‌ను స్వీకరించి ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలని వారిని రాశీఖన్నా కోరారు..

ఇక రాశీఖన్నా సినిమాల విషయానికి వచ్చేసరికి గత ఏడాది ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలతో మంచి హిట్టు కొట్టిన రాశీఖన్నా మళ్ళీ ఫుల్ జోష్ లొకి వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రెండేసి చిత్రాలు చేస్తుంది రాశీఖన్నా. 

Tags:    

Similar News