Bandla Ganesh react on SS Rajamouli: రాజమౌళికి బండ్ల గణేష్ భరోసా... రోజు కోడి గుడ్లు తినాలంటూ..

Bandla Ganesh react on SS Rajamouli: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతూ ప్రజలను మరింతగా భయబ్రాంతులకు గురిచేస్తోంది కరోనా.

Update: 2020-07-30 09:26 GMT
Producer bandla ganesh react on rajamouli's corona posstive

Bandla Ganesh react on SS Rajamouli: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతూ ప్రజలను మరింతగా భయబ్రాంతులకు గురిచేస్తోంది కరోనా. అయితే ఇందులో ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఎక్కువగా ఉండడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని తెలుపుతూ.. ఆయనతో పాటు కుటుంబ సబ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. కొద్దీ రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయిందని, అయితే ఈ రోజు వచ్చిన టెస్టు ఫలితాల్లో కాస్త కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయిందని ట్విట్టర్ లో వెల్లడించారు. అందువల్ల కుటుంబం అంతా అన్ని జాగ్రత్తలు, వైద్యుల సలహాలు తీసుకుంటూ హోం క్వారంటైన్ లో ఉంటున్నట్టుగా రాజమౌళి వెల్లడించారు... తన ఆరోగ్యం గురించి బయపడాల్సింది ఏమి లేదని, మేము ఇలా చేయడం వలన ఆరోగ్యంగా మారి, వేరే వారికీ ప్లాస్మా డొనేట్ చేయొచ్చని చెప్పారు.

రాజమౌళికి కరోనా సోకడంతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది.. ఆయన కుటుంబం కరోనా నుంచి తొందరలోనే కోలుకోవాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటుగా అభిమానులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ...ఏమీ కాదు.. సంతోషంగా, హాయిగా ఉండండి సార్. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి అంటూ ట్వీట్ చేశారు బండ్ల.. గతంలో కరోనా బారిన పడిన బండ్ల గణేష్ తాజాగా కొలుకున్నారు..

ఇక అటు రాజమౌళి ప్రస్తుతం అర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News