ఈ విషయంలో సస్పెన్స్ లో పెట్టిన బన్నీ చిత్రబృందం

Update: 2019-02-12 06:40 GMT

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను చాలా కాలం పాటు వెయిటింగ్ లో పెట్టి ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అని తెలిసిన విషయమే. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపిస్తున్నారు అనే విషయం పై ఇంకా క్లారటీ రాలేదు. ఈ నేపథ్యంలో బోలెడు హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చాయి.

ముందుగా 'భరత్ అనే నేను' బ్యూటీ కీయార అద్వానీ పేరు బయటకు వచ్చింది. తరువాత హ్యాపెనింగ్ బ్యూటీ రష్మీక మందన్న పేరు కూడా వినిపించింది. తరువాత మళ్ళీ కీయార నే ఫిక్స్ అన్నారు కొందరు. బయట ఎన్ని పుకార్లు వచ్చినా చిత్రబృందం మాత్రం నోరువిప్పట్లేదు. ఇంతకీ బన్నీ తో రొమాన్స్ చేసే భాగ్యం ఎవరికి దక్కతుందో వేచి చూడాలి. గీత ఆర్ట్స్ బ్యానర్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Similar News