O Pitta Katha: అన్నా... ఇక చూస్కో బాక్సాఫీస్ బద్దలే!
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కీన చిత్రం ఓ పిట్ట కథ .. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కీన చిత్రం 'ఓ పిట్ట కథ' .. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ద్వారా చందు ముద్దు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమాని మార్చి 06 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తాజాగా హైదరాబాదులో నిర్వహించింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హజరై సినిమా మంచి విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇక బ్రహ్మాజీ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలతో 'ఓ పిట్టకథ' చిత్రానికి మంచి హైప్ తీసుకువస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయించారు. రానా, ప్రభాస్ లతో సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ లను లాంచ్ చేయించారు. ఇక బ్రహ్మాజీతో మంచి అనుబంధం ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఓ పిట్టకథ' చిత్ర యూనిట్ కి ట్విట్టర్ ద్వారా విషెస్ అందించారు. 'సంజయ్కి నా స్నేహితుడు బ్రహ్మాజీకి, రేపు రిలీజ్ అవ్వబోతున్న ఓ పిట్ట కథ టీంకి బెస్ట్ విషెస్' అని తారక్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.
Best wishes to Sanjay, my friend @actorbrahmaji and the entire team of #OPittaKatha for the release tomorrow
— Jr NTR (@tarak9999) March 5, 2020
ఈ ట్వీట్కు బ్రహ్మాజీ స్పందిస్తూ రిప్లై ఇచ్చారు.. 'అన్నా ఈ మాట కోసం వెయిటింగ్..ఇక చూస్కో బాక్సాఫీస్ బద్దలే. లవ్యూ ఫరెవర్' అన్నారు.
Anna..ee maata kosam waiting ..ika chusuko..box office baddal..
— #OpittaKatha 6th March (@actorbrahmaji) March 5, 2020
Thank u dear..u always there for me ..love u forever 🙏🏼🤗🙏🏼 https://t.co/3tLBbf1cul