Jathi Ratnalu: 'జాతి రత్నాలు' టీజర్ రిలీజ్

Update: 2021-02-12 14:39 GMT

జాతి రత్నాలు 

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన లెటెస్ట్ మూవీ 'జాతి రత్నాలు'. నవీన్‌ పోలిశెట్టికి జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ముర‌ళీ శ‌ర్మ రూ.500 కోట్ల ప్రాజెక్టుతో ఈ ముగ్గురు హీరోలకు ఉన్న సంబంధమే చిత్ర కథగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.

అదే ఈ ముగ్గురి జీవితంలో 'లైఫ్‌ అండ్‌ డెత్‌' పరిస్థితి వచ్చిన నవ్వులు పంచుతూ సాగుతుంది ఈ టీజర్‌. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ సిద్దం మ‌నోహ‌ర్, సంగీతం రాధన్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వీకే నరేశ్‌, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 11వ తేదీన 'జాతి రత్నాలు' థియేటర్‌లలో రీలీజ్ కానుంది.

Full View

Tags:    

Similar News