నాని తో కుదర్లేదని మళ్ళీ నాగ శౌర్య తో సరిపెట్టుకున్నాడు

Update: 2019-01-21 07:41 GMT

ఒకవైపు నటుడిగా మంచి పాత్రలు చేస్తుండడమే కాక మరొకవైపు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నాడు అవసరాల శ్రీనివాస్. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ నటనపై మొగ్గు చూపిన శ్రీనివాస్ కొంతకాలం తరువాత నాగశౌర్య, నారా రోహిత్ లను హీరోలుగా పెట్టి 'జో అచ్యుతానంద' సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఆ సినిమాకు అనుకున్నంత మంచి ఫలితాలు దక్కలేదు. ఇక రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నాగశౌర్య ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు అవసరాల. నిజానికి ముందుగా ఈ కథలో హీరోగా నాని ని అనుకున్నాడు కానీ నాచురల్ స్టార్ బిజీగా ఉండటంతో మళ్ళీ నాగశౌర్య తోనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదటి భాగం లో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

Similar News