Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-28 23:30 GMT
Live Updates - Page 2
2020-06-29 14:17 GMT

- మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇంటర్ విద్యార్థినిలు మిస్సింగ్

- బిజేఆర్ నగర్ కు చెందిన గ్లోరియా (19) సంవత్సరాలు ఇంటినుండి చెప్పకుండా వెళ్లిపోయినట్లు

- గ్లోరియా తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు .

- మౌలాలి షఫీ నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని నవనీత (18) యువతి ఇంటి నుండి తల్లితండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయినట్లు నవనీత తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు

- రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలుసులు

2020-06-29 14:16 GMT

- హైదరాబాద్ లాక్ డౌన్ తో తెలంగాణ లో జరగాల్సిన ఎంట్రన్స్ పరీక్షలపై ప్రభావం

- ఎంసెట్, ఈసెట్, పీజీ సెట్ లు వాయిదా పడే అవకాశం

- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 80 శాతం పరీక్షా కేంద్రాలు

- జులై ఒకటి నుంచి 20 వరకు వివిధ ఎంట్రన్స్ లు

- ఉన్నత విద్యా మండలి , వివిధ యూనివర్సిటీ ల అధికారులతో జరుగుతున్న కీలక సమావేశం

2020-06-29 14:14 GMT

కరీంనగర్ పోలీస్ రేంజ్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్

_ కరీంనగర్ రేంజ్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కు చెందిన ఇద్దరు ఎస్ఐలు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కరీంనగర్ రేంజ్ ఇంఛార్జి డీఐజీ పి ప్రమోద్ కుమార్ ...

- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎల్ ప్రవీణ్ కేసును నమోదు చేయడంలో ఆలస్యం చేయడం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలం కావడం కారణాలతో సస్పెన్షన్

- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్ఐ ఎన్ వెంకటేష్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కలప ను తెప్పించి వివిధ రకాల వస్తువులను తయారు చేసినందుకు గాను సస్పెన్షన్

2020-06-29 14:13 GMT

_నాగరత్న ఐఎండి అసిస్టెంట్ డైరెక్టర్ @ హైదరాబాద్....

- దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...

- మరట్వాడ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం 3.5 కి.మి ఆవరించి ఉంది...

- మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది...

- ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది....

- ఉరుములు ,మెరుపులతో పాటు 30 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది....

- ఇవాళ ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

- సంగారెడ్డి, మెదక్ ,సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ ,వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

2020-06-29 12:24 GMT

పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టం ఎప్పుడు ఫెయిల్ కాదు : సీపీ అంజనీ కుమార్

- నక్సల్స్ సమస్య నుంచి కరోనా వరకు అన్ని సమస్యలను పోలీసులు ముందుడి ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు.

- దేశంలోని ఇతర ప్రధాన సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ కేసులు రావడానికి సిటీ పోలీసులే కారణం అని ఆయన తెలిపారు.

- మా డిపార్ట్మెంట్ హీరోస్ ను వెల్కమ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

- పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టం ఎప్పుడు ఫెయిల్ కాదన్నారు.

-జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ప్రతీ సందర్భంలో పోలీసులు ముందున్నారన్నారు.

- కరోనాను ఎదుర్కోవడంలో సిటీ పోలీసుల కృషి చరిత్రలో నిలుస్తుందన్నారు.

- కరోనాను జయించాక తిరిగి మాస్కులు...సానిటైజర్లు వాడాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి ఆయన సూచించారు.

- ప్రతి ఒక్క పోలీసుల కుటుంబసభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



2020-06-29 10:22 GMT

మచిలీపట్నం

- జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్య

- మార్కెట్ లో ఉండగా కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తి

- దాడిలో గాయపడ్డ భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

- చికిత్స పొందుతూ మృతి

- పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానం

- ఆస్పత్రికి భారీగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు

- భారీగా మోహరించిన పోలీసులు

- గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గా పని చేసిన భాస్కరరావు



2020-06-29 10:20 GMT

కృష్ణాజిల్లా

- నందిగామ మండలం మనగచర్ల గ్రామానికి చెందిన క్రైమ్ ఇండియా రిపోర్టర్ గంట నవీన్ హత్య కేసును ఛేదించిన నందిగామ పోలీసులు.

- ఈ కేసులో తొమ్మిది మంది నేరస్తులను మీడియా ముందు హాజరు పరిచిన నందిగామ డిఎస్పీ.

- తొమ్మిది మందిలో ఒకరు బాల నేరస్తుడు.

2020-06-29 10:14 GMT

కృష్ణాజిల్లా :

- మచిలీపట్నం.

- మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరావు పై మునిసిపల్ చేపల మార్కెట్ లో హత్యాయత్నం.

- కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తి . హాస్పిటల్ కు తరలింపు.

2020-06-29 09:47 GMT

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

- నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉధ్రిక్త వాతావరనం నెలకొంది.

- తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కేరళ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయాలంటూ, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలంటూ స్టేట్‌ క్యాబ్స్‌ అండ్‌ బస్‌ ఆపరేటర్‌ అసోసియేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది.

- పూర్తి వివరాలు 

2020-06-29 09:45 GMT

జూలై 2 న తెరుచుకోనున్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం

- కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని దేవాలయాలు మూత పడిన విషయం తెలిసిందే.

- ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కొన్ని ఆలయాలను తెరచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ, మరి కొన్ని ఆలయాలు ఇంకా తెరచుకోకుండానే ఉన్నాయి.

- ఆ ఆలయాల జాబితాలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం కూడా ఒకటి.

- పూర్తి వివరాలు 

Tags:    

Similar News