Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-20 00:33 GMT
Live Updates - Page 2
2020-06-20 04:17 GMT

భారత్‌లో కొత్తగా 14,516 కరోనా పాజిటివ్‌ కేసులు

- గడిచిన 24 గంటల్లో భారత్‌లో 14,516 కేసులు నమోదు కాగా, 375 మంది ప్రాణాలు విడిచారు.

- కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,95,048 కేసులు నమోదయ్యాయి.

- ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,68,269 ఉండగా, 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

- ఇదిలా ఉండగా 12,948 మంది కరోనా వ్యాధితో మరణించారు. 

2020-06-20 04:15 GMT

ఏపీలో పదో తరగతి పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

- ఏపీలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

- రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు.

- కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో, రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

- పూర్తి వివరాలు 



2020-06-20 02:44 GMT

- సూర్యగ్రణం సందర్భంగా విజయవాడలో దుర్గమ్మ ఆలయం మూసివేత

- నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత..

- సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8గంటలకు ఆలయం మూసివేత

- రేపు మ.3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ

- సా.5 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి..

2020-06-20 02:43 GMT

- రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత..

- నేటి రాత్రి 8.30 నుంచి రేపు మ.2.30 వరకు శ్రీవారి ఆలయం మూసివేత

- రేపు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ.

- అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి

2020-06-20 02:42 GMT

నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు

- నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

- వీటిని వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

- అయితే కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని నిర్వహిస్తున్నారు. 

- ఈ నెల 20, 22, 24 తేదీలలో పీజీ డిప్లొమా పరీక్షలు.

- జూన్ 20, 22, 24, 26 తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు జరగనున్నాయి.

- ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

- ఉదయం 8.30కి స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి.

- మొత్తం 13 సెంటర్లు ఉండగా.. గాంధీ మెడికల్ కాలేజీ సెంటర్‌ను కామినేని అకాడమీ - ఆఫ్ మెడికల్ సైన్సెస్ , ఎల్బీ నగర్, సికింద్రాబాద్‌కు తరలించారు.

- 994 మంది పీజీ డిగ్రీ పరీక్షలు, 193 మంది పీజీ డిప్లొమా పరీక్షలు రాయనున్నారు.

-పూర్తి వివరాలు 



2020-06-20 02:41 GMT

ఈరోజు వై.ఎస్‌.ఆర్‌. నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్ధిక సాయం విడుదల

- కరోనా, లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలలు ముందుగానే ఆర్ధిక సాయం

- క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్‌.జగన్‌

- సొంత మగ్గమున్న నేతన్నల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున ఆర్ధిక సాయం.

- మొత్తం 81,024 మంది లబ్ధిదార్లకు రూ.194.46 కోట్ల అర్ధిక సాయం అందజేయనున్న ప్రభుత్వం

- చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.103 కోట్లు చెల్లించేందుకు ఆప్కోకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

- కరోనా వైరస్‌ నివారణకై మాస్కుల తయారీకై ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.

-పూర్తి వివరాలు 



Tags:    

Similar News