Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-06 01:02 GMT
Live Updates - Page 2
2020-06-06 02:36 GMT

నేటి నుంచి ఏపీలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం

►ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు..

► దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే అర్హులకు రేషన్ కార్డు 

►రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీ

2020-06-06 02:35 GMT

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటీ విచారణ

►నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న హైపవర్ కమిటీ

►తొలిరోజు నిపుణుల కమిటీలతో రెండు దశల్లో హైపవర్ కమిటీ భేటీ

►రెండో రోజు వీఎంఆర్‌డీఏ ప్రాంగణంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం..

►మూడో రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించనున్న హైపవర్ కమిటీ..



2020-06-06 02:33 GMT

జూన్ 9 నుంచి కేరళలో దైవ దర్శనాలు

- కేరళలోనూ జూన్ 9 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

- కేంద్ర మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు.

- శబరిమలలో ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.

- వర్చువల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీని నియంత్రిస్తామని తెలిపారు సీఎం పినరయి విజయన్.



 


2020-06-06 01:24 GMT

కరోనా వైరస్ కేసుల్లో ఇటలీకి చేరువలో ఇండియా!

- రోగుల సంఖ్యలో  ఇటలీని మన దేశం  దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి.

- దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి దగ్గరలో నిలిచింది.

- తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

- దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే.

- మరోవైపు, మరణాల సంఖ్యా పెరుగుతోంది.

.  24 గంటల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు.

- రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇప్నాపటివరకూ నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.



Tags:    

Similar News