Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-31 01:47 GMT
Live Updates - Page 2
2020-10-31 12:08 GMT

Srinivas Goud Comments: దేశంలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోన్నది తెలంగాణ ప్రభుత్వమే...

 శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్:

* అగ్రి డాక్టర్ వ్యవస్థను ప్రవేశ పెట్టింది మా ప్రభుత్వమే...

* గతంలో దళారుల చేతిలో రైతన్నలు దారుణంగా మోస పోయేవారు...

* దలారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు...

* కానీ మా ప్రభుత్వం దళారి వ్యవస్థను రూపుమాపెందుకు నేరుగా ప్రభుత్వమే రైతు నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది...

* నియంత్రిత వ్యవసాయం క్రింద మక్క వేయొద్దంటే రైతులు వేశారు... అయినప్పటికీ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తూ మక్కా కొనేందుకు ముందుకు వచ్చింది...

* జిల్లాలో వరి కొనుగోలుకు 190 కేంద్రాలు ఏర్పాటు చేసాం...

* వచ్చే వర్ష కాలానికి పంట మార్పిడి చేసేలా అదికారులు రైతులను సన్నద్ధం చేయాలి...

* తెరాస అధికారంలో ఉన్నంత వరకు సీఎం రైతు బంధు ఇస్తామన్నారు...

2020-10-31 12:04 GMT

Hyderabad Updates: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసుమాముల లో ఇల్లు లూటీ చేసిన దొంగలు...

హైదరాబాద్...

- పసుమాముల గ్రామంలో బాబు గౌడ్ ఇంట్లో చోరీ..

- 2 లక్షల నగదు,15 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు...

- ఇంటికి తాళం వేసి ఫంక్షన్ కు వెళ్లిన బాబు గౌడ్..

- తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం ను పగులగొట్టి దోచుకెళ్లిన దుండగులు..

- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. 

2020-10-31 12:01 GMT

Adilabad Updates: జల్ , జంగల్, జమీన్ కోసం కొమరం భీమ్ అసువులు బాసాడు..

 ఆదిలాబాద్ జిల్లా....

* ఆదిలాబాద్ కొమరం భీమ్ వర్థంతి సభలో ఎమ్మెల్యే రామన్న. కామెంట్స్

* గిరిజన ప్రాంతాలలో సాగునీరు అందించడానికి చెరువులు, కుంటలు తవ్విస్తాం‌‌

* గిరిజన గూడాల అభివృద్ధి కోసం చిన్న పంచాయితీలను ఏర్పాటు చేశారు

* గిరిజన సమస్యలను పరిష్కరించడానికి సర్కార్ సిద్దంగా ఉంది..

* గిరిజన సమస్యల పరిష్కారం కోసం అదివాసీల బ్రుందాన్ని ముఖ్యమంత్రి దగ్గర కు తీసుకవెళ్లుతాం..

* కరోనా తీవ్రత తగ్గానే సీఎం కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటిస్తారు

* పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తాం

2020-10-31 11:28 GMT

Hyderabad Updates: ఆఫర్ల తో పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్య...

 హైదరాబాద్... 

* హైదరాబాద్ లో ఆఫర్ల తో పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్య

* మెట్రో ప్రయాణికుల కోసం సువర్ణ ఆఫర్ ప్రారంభించిన హెచ్ ఎమ్మార్

* ప్రతి రోజు లక్షా 30 వేల మంది ప్రయాణిస్తున్నారు

* మెట్రో స్మార్ట్ కార్డు రిచార్జి పై 50 శాతం క్యాష్ బ్యాక్

2020-10-31 05:01 GMT

Jangaon District Updates: సీఎం పర్యటన వేళా ప్రతిపక్షాల నేతల అరెస్టుల పర్వం..

 జనగామ జిల్లా:

// జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి,ఎమ్మార్పీఎస్, గొర్ల కాపరులు సంఘం నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు..

// సీఎం రోడ్డు మార్గం గుండా వస్తుండడంతో కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు..

// పెంబర్తి తోరణం మీదగా.. కొడకండ్ల రైతు వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం కేసీఆర్..

// అరెస్టులను ఖండిస్తున్న ప్రతిపక్షాలు...

2020-10-31 04:53 GMT

Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉదృతి...

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా

-12 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 96,80 మీటర్లు

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 14,100 క్యూసెక్కులు

2020-10-31 04:50 GMT

Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి తగ్గుతున్న వరద...

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

-గేట్లు మూసిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 118.05 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 8.65 టీఎంసీ

-ఇన్ ఫ్లో 7000 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 0 క్యూసెక్కులు

2020-10-31 04:14 GMT

Siddipet Updates: సిద్దిపేట , దుబ్బాక టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్లలో సోదాలు...

 సిద్దిపేట...

- ఏక కాలం లో 8 మంది టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్ల లో సోదాలు జరిపిన పోలీస్ లు..

- దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి , దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత   రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు   కొండం   సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు..

- ఈ సోదాల్లో ఎవరి ఇంట్లో కూడా ఏమి దొరకలేదు..

2020-10-31 03:08 GMT

Kamareddy District Updates: జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు...

 కామారెడ్డి :

* భిక్కనుర్ మండల కేంద్రము లో జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు

* రోహిత్ అనే నాలుగు సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలింపు.

2020-10-31 02:47 GMT

Jangaon District Updates: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన...

 జనగామ జిల్లా..

* పాలకుర్తి నియోజవర్గం పరిధిలోని కొడకండ్లలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

* హైద్రాబాద్ (బేగంపేట) నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా

* 12:30గంటలకు కొడకండ్ల కు చేరుకుంటారు.

* 12:40 నివిుషాలకు.కొడకండ్ల గ్రామంలో ఉన్న రైతు వేదికను ప్రారంభిస్తారు.

* 12:50నివిుషాలకు పల్లెప్రకృతివనాని సందర్శిస్తారు

* అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 5000 మ౦ది రైతులతో సమావేశంలో పాల్గొంటారు..

* సభ అనంతరం మండల పార్టీ కొడకండ్ల లోనే మధ్యాహ్న భోజనం..

* అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం..

Tags:    

Similar News