Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-28 01:34 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-28 16:00 GMT

అమరావతి..

మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి కామెంట్స్

-మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

-మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎంయన్సీ కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం.

-మహిళ ల స్వయం ఉపాధికి సహకరించాలని బ్యాంక్ అధికారులతో కూడా చర్చించాం.

-చేయుత పధకం కింద అనేక చిన్న తరహా పరిశ్రమలకు,చేతి వృత్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

-సెర్ప్ ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం.

-ఎస్సెల్బిసి చైర్మన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళాము.

-వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం.

2020-09-28 15:57 GMT

అమరావతి..

-వివిధ ఎంఎన్సి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రులు

-హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సిదిరి అప్పలరాజు

2020-09-28 15:54 GMT

అమరావతి..

మోపిదేవి వెంకట రమణ రావు,ఎంపీ.. కామెంట్స్...

-అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం చేయడం అధికారం పోయినప్పుడు బీసీలను వాడుకోవడం చంద్రబాబు పని

-ఇప్పుడు అధికారం లేదు కాబట్టి జెండాలు మోయటానికి, జై జైలు పలకడానికి, కేసులు పెట్టించుకోవడానికి చంద్రబాబు బీసీల జపం చేస్తున్నాడు

-చంద్రబాబుది మొదటి నుంచి అదే పద్ధతి

-అధికారంలో ఉన్నప్పుడు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు

-చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు

-ఎన్నికల ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు

-ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు

-బీసీల కోసం 57 కార్పొరేష న్లు ఏర్పాటు చేశాం

-వీటి ద్వారా 700 పైచిలుకు మందినికి నాయకత్వ లక్షణాలు పెంపొందించి అవకాశాలు కల్పిస్తున్నాం

-చంద్రబాబు ఆలోచనలో బీసీల అభివృద్ధి అంటే నాలుగు గేదలు, ఒక ఇస్త్రీ పెట్టి

-ఏడాదిన్నర కాలంలో రెండు కోట్ల మంది బీసీలు లబ్ధి పొందేలా 19750 కోట్ల రూపాయలు ఆర్థిక పరమైన చేయూత అందించాం

-బీసీ వర్గానికి చెందిన జస్టిస్ ఈశ్వరయ్యకు చంద్రబాబు అన్యాయం చేశారు

-చంద్రబాబు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏం న్యాయం జరిగిందో ఏడాది జగన్మోహన్ రెడ్డి పాలన లో బీసీలు ఎలా అభివృద్ధి చెందారో   చర్చకు సిద్ధ

2020-09-28 15:28 GMT

తిరుపతి..

-సిబిఐ కేసులో టిటిడి పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డికి ఊరట..

-సరైన సాక్ష్యాదారాలు లేకపోవడంతో ఆయనపై కేసును కొట్టేసిన సిబిఐ కోర్టు

-పాతనోట్ల రద్సు సమయంలో 247కోట్లు దొడ్డిదారిన మార్చారన్న అభియోగంపై సిబిఐ కేసు నమోదు

-పూర్తి విచారణ అనంతరం సాక్ష్యాదారాలు లేవని కేసు కొట్టేసిన సిబిఐ కోర్టు

2020-09-28 14:52 GMT

విజయవాడ..

కలెక్టర్ ఇంతియాజ్..

-కరోన బాధితులకు ప్రత్యేక రూంలతో పాటి పీపీ కిట్స్ తో పరిక్షలు నిర్వహించం.

-జిల్లాలో ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి పరిక్షలు నిర్వహించం.

-హెల్ప్ డెస్క్... కరోన ధర్మల్ స్క్రీనింగ్ చేసేకె పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇచ్చాము.

-32,405 మంది గైహాజరయ్యారు.

-87,136 మంది హాజరయ్యారు.

-పరీక్ష కేంద్రంలో గదికి 12 మందిని మాత్రమే అనుమతి ఇచ్చాము.

2020-09-28 14:34 GMT

అమరావతి..

సి.ఐ.డి ప్రధాన కార్యలయం మంగళగిరి

-ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గుంటూరులో అగ్రిగోల్డ్ డిపోజిటర్లకు ప్రభుత్వమే సొమ్మును తిరిగి చెల్లించే కార్యక్రమం   చేపట్టారు

-మొదటి విడతలో 3,59,655 మంది డిపోజిటర్లకు 264 కోట్ల రూపాయలు G.O. Rt. No. 930, 01-11-2019 న కేటాయించి చెల్లించారు

-మొత్తం 1150 కోట్ల రూపాయలు చెల్లించడం కోసం ప్రభుత్వం G.O.Rt. No. 913, 25-10-2019 న విడుదల చేసారు

-హైదరాబాద్ హైకోర్ట్ పరిధిలో ఈ అంశం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంది

-తొలివిడుత పదివేల పాయల నష్టపరిహారం కొద్ది మందికి అందలేదన్న విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది

-గత అక్టోబర్లోనే అలా మిగిలిన పదివేల రూపాయల లోపు డిపాజిటర్లకు, ఇరవై వేల రూపాయల డిపాజిటరచెల్లించాలని ఆదేశించి, హైదరాబాద్ హై కోర్ట్ కు   నివేదించారు

-ఇరవై వేల రూపాయల డిపోజిట్ల పంపిణీకి విధి విధానాలు హైదరాబాద్ హై కోర్ట్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాము

-హైదరాబాద్ హై కోర్ట్ వారి ఆదేశాలు రాగానే, గతంలో చెల్లింపులు జరగని పదివేల రూపాయల డిపోజిటర్లకు కూడా చెల్లింపులు జరుగుతాయని     తెలియచేస్తున్నాము

2020-09-28 13:41 GMT

శ్రీకాకుళం జిల్లా..

-స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

-తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గరగా చూసిన జగన్ అధికారమలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు..

-అందులో భాగమే వైఎస్సార్ జలకళ పధకం..

-జిల్లాలో 23 వేల మంది రైతులకి ఈ పధకం ద్వారా లబ్ధి చేకూరుతుంది..

-రైతులకు బోర్లు తవ్వించడమే కాక మరో 1700 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి మోటర్లు అందించాలని సిఎం జగన్ నిర్ణయించారు..

-దేశంలోనే ఉచితంగా బోరు బావులు తవ్విస్తున్న ప్రధమ రాష్ట్రం మనది..

-జగన్ మాట ఇస్తే జరిగి తీరుతుంది..

-జగన్మోహనాస్త్రాలలో జలకళ పధకం ఒకటి..

-అన్నివర్గాల ప్రజల ఆకాంకాశాలను నెరవేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను..

2020-09-28 12:50 GMT

అమరావతి..

-రాష్ట్రంలో వరుస వరద విపత్తులు- ఎడతెరిపిలేని భారీ వర్షాలు

-రైతాంగానికి తీవ్ర నష్టం- పంటనష్టం అంచనాలను శీఘ్రగతిన చేపట్టడం

-వరద బాధితులకు నష్ట పరిహారం తక్షణమే అందించడం-కనీస మద్దతు ధర చెల్లించడం

-వరదల్లో దెబ్బతిన్న పంట ఉత్పత్తుల కొనుగోళ్ల గురించి...లేఖలో వివరించిన చంద్రబాబు

2020-09-28 12:35 GMT

విశాఖ..

-మంద కృష్ణ మాదిగ కామెంట్స్

-నాకు కులం కన్నా మతం కన్నా మానవత్వం వైపే నా ప్రయాణం

-మాదిగ హాక్కుల పోరాటమే A,B,C,Dల వర్గీకరణ.

-సుప్రీం కోర్టు వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం లోని ఆంశం అని చెప్పి నెల రోజులైనా జగన్ ఇప్పటి వరకు స్పందించ లేదు

-తన తండ్రి ఆశయ సాధన కోసం పోరాడాతానని చెప్పిన ముఖ్య మంత్రి మాట నిలబెట్టుకోవాలి

-తన తండ్రి గతంలో నే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం ఆమోదం తెలిపారు

-తండ్రి ఆశయం నెరవెర్చుకోవటం కోసం దేవుని నమ్మిన వ్యక్తి గా ఆయన ఆశయం అడుగుజాడల్లో నడవాలి.

2020-09-28 12:32 GMT

తూర్పుగోదావరి -రాజమండ్రి

-రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రామ్..

-రాష్ట్రానికి రావల్సిన జి.ఎస్.టి. బకాయిలు, విభజన హామీల కోసం కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిస్తే

-ఎ.పి.కి అప్రదిష్ట తెచ్చేలా చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు

-తిరుమలలో శ్రీవారి తిరునామాన్ని తన నుదుటన ధరించటం కంటే

-సి.ఎం. జగన్ ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఇంకేమి ఉంటుంది

-రాజమండ్రిలో ,భగత్ సింగ్ 114వ జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ భరత్

Tags:    

Similar News