Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-28 12:44 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 28 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి మ.1-17 తదుపరి త్రయోదశి | పూర్వాభాద్ర నక్షత్రం ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-28 16:35 GMT

విశాఖ

- ఎద్దు వెనుక నుంచి పొడవడంతో నల్లి వసంతరావు అనే వృద్దుడు మృతి

- కూర్మన్నపాలేం వద్ద కొబ్బరిబొండాలు అమ్ముతుండగా ఘటన

- ఆసుపత్రికి తరిలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టరు వెల్లడి

2020-10-28 16:33 GMT

నెల్లూరు :--

-అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో తమ బంధువుల వివాహానికి హెలికాప్టర్ లో వచ్చి హాజరైన హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం.

-ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామంలోని హై స్కూల్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన విషయంపై సీరియస్ అయిన జిల్లా ఉన్నతాధికారులు.

-హెలికాప్టర్ ల్యాండ్ అయిన రేవూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ మరియు హెలికాప్టర్ లో వచ్చిన వారిపై కేసు నమోదు చేసేందుకు విచారణ చేపట్టిన పోలీసులు..

2020-10-28 16:31 GMT

 అమరావతి

-బీసీ సంక్షేమ కృషీవలుడు సి.ఎం. జగన్మోహన్ రెడ్డి:

-బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ

- బీసీ కార్పోరేషన్లు, బీసీ సంక్షేమ పధకాలు, శాఖపరమైన సమస్యలపై చర్చించిన మంత్రి.

-కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పోరేషన్లకు సంబంధించి సి.ఎం. జగన్మోహన్ రెడ్డితో చర్చించిన మంత్రి

-వెనుబడిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు

-56 బీసీ కార్పోరేషన్లకు 56 ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు కలిపి మొత్తం 720 మంది బీసీలకు ప్రభుత్వంలో సి.ఎం. జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కల్పించారు.

-సి.ఎం జగన్మోహన్ రెడ్డి బడుగుబలహీన వర్గాల మనస్సులో చిరస్ధాయిగా నిలిచిపోతారు : మంత్రి వేణు

2020-10-28 16:28 GMT

కృష్ణాజిల్లా

- ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

- ఏలూరు నుండి విజయవాడ వైపు తరలిస్తున్న గంజాయి

- పోలీసులను చూసి భయంతో కారు వదిలి పరారైన దుండగులు

2020-10-28 16:27 GMT

 అమరావతి

*ఒక్కోి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటన

*వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ద్వారా ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.18 లక్షలు అందజేయనున్న ప్రభుత్వం

*మృతి చెందిన ఆరుగురు కూడా విద్యార్థులు, యువకులు కావడంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని భరోసా...

*జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, SP నారాయణ నాయక్, పోలవరం MLA తెల్లం బాలరాజు తో ఫోన్ లో మాట్లాడి ఘటన పై మంత్రి ఆళ్ల నాని ఆరా...

*ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశం...

2020-10-28 14:48 GMT

అమరావతి

- వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు కరోనా బారిన పడ్డారని ఎస్ఈసీ లెక్కలతో వివరించిన సీఎస్.

- కీలకమైన పోలీసు శాఖలో వేల సంఖ్యలో కరోనా కేసులున్నట్టు ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన సీఎస్.

- ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహాణ అనేది కష్టమనే భావనను వ్యక్తం చేసిన సీఎస్ నీలం సాహ్నీ.

- పరిస్థితులు కుదటపడగానే ఎస్ఈసీని సంప్రదిస్తామని వెల్లడి.

- కరోనా పరిస్థితులను ఎస్ఈసీకి ఎప్పటికప్పుడు వివరిస్తామన్న సీఎస్.

2020-10-28 14:46 GMT

 అమరావతి

* సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

* రాజధాని ప్రాంత రైతులను‌ బేషరతుగా విడుదల చేయాలి

* అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులు తమ గోడు చెప్పుకోవడాన్ని నేరంగా భావించడం సరి కాదు

* ప్రజా స్వామ్యంలో తమ సమస్య లను చెప్పుకునే హక్కు అందరకీ ఉంటుంది

* తీవ్రమైన నేరం చేసిన వారిలా.. ఉగ్రవాదుల్లా సంకెళ్లతో తీసుకెళ్లడం అప్రజాస్వామికం

2020-10-28 14:39 GMT

 విశాఖ

- మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

- త్వరలో ఎన్ ఏ. డి ఫ్లై ఓవర్ పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

- బీచ్ కారిడార్ అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ద వుంది.

- బీచ్ ట్రాఫిక్ తగ్గించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.

- విశాఖ పరిపాలన రాజధానితో పాటు టూరిజం రాజధానిగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

2020-10-28 14:08 GMT

  అమరావతి

// విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం

// పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన పట్ల గవర్న ర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర     దిగ్ర్భాంతి

// వసంతవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకోగా, ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం

// భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లాగా, సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన       గొట్టుపర్తిమనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18) గల్లంతయ్యారు.

// గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు.

// విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరి చందన్

// పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు

2020-10-28 13:58 GMT

   శ్రీకాకుళం జిల్లా..

-- సంక్షేమ పథకాలు అమలులో అధికారులు అక్రమాలకు పాలపడితే తొక్కతీస్తాం అంటూ వార్నింగ్..

-- అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే అధికారులకు తొక్కలూడతీస్తాం అంటూ హెచ్చరికలు..

-- ప్రభుత్వ పథకాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలని ఆదేశం..

-- టాంపరింగ్ లకు పాల్పడుతూ అర్హులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు..

Tags:    

Similar News