Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-27 03:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧


ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-27 16:23 GMT

 నిజామాబాద్

-అకాల వర్షాలు, దోమ పోటు వల్ల నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ కామెంట్స్..

-వారితో పాటు పత్తి రైతులను కూడా వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి

-మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగాల్సింది దుబ్బాకలో కాదు పంటపొలాల్లో

-సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ప్రేమ రైతులపై లేదు

2020-10-27 16:06 GMT

కరీంనగర్ :.

* సుడా ఛైర్మెన్ జివి రామకృష్ణ కామెంట్స్

* బండి సంజయ్ ది దొంగ దీక్ష , మీ పార్టీ కార్యకర్తలకు డబ్బులతో ఓట్లను కొనండి అని ప్రోత్సహించడానికా మీ దీక్ష...

* మీ చిల్లర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ దీక్ష,

* మంత్రి హరీష్ రావు గారి సవాలును ఎదుర్కునే దమ్ము లేక ఈ వేషాలు వేస్తున్నారు...

* ఎలక్షన్స్ దుబ్బాకలో జరిగితే దీక్ష రాజకీయాలు కరీంనగర్ లో చేస్తున్నారు ...

* దుబ్బాకలో ప్రచారం చేసే పరిస్థితి లేక కరీంనగర్లో దొంగ దీక్ష చేస్తున్నారు

2020-10-27 15:54 GMT

సిద్ధిపేట జిల్లా...

*మీడియా,పత్రికా సంస్థల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ ,దుబ్బాక BJP అభ్యర్థి రఘునందన్ రావు పై TUWJ (I JU)   మండిపాటు..

* సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో TUWJ (I JU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు కె. రంగాచారి,మీడియా అకాడమీ సభ్యులు కె.అంజయ్య తో పాటు సిద్ధిపేట జర్నలిస్టు ల ప్రెస్ మీట్.

* మీడియాపై,పత్రికల పై అనుచిత వ్యాఖ్యలు BJP అధ్యక్షుడు బండి సంజయ్ తన స్థాయిని దిగజార్చు కున్నారు...

* జర్నలిస్టుల ను మీడియా సంస్థలను బెదిరిస్తూ మాట్లాడడం అప్రజాస్వామికం..

* బండి సంజయ్ తన స్థాయిని రాష్ట్ర స్థాయి నుండి గల్లీ స్థాయికి దిగజార్చుకున్నారు...

* సిద్ధిపేట లో జరిగిన ఘటనను మీడియా సంస్థలకు,అక్కడి జర్నలిస్టు లకు అంటగట్టడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం..

* తన వ్యాఖ్యల పై బండి సంజయ్ మీడియాకు,జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి..

* సిద్ధిపేట జర్నలిస్టు ల పై BJP అభ్యర్థి రఘునందన్ రావు బెదిరింపులకు దిగడం,దుర్భాశలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..

* రఘునందన్ రావు,ఆయన అనుచరులు సిద్ధిపేట జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి..

2020-10-27 15:46 GMT

- చంచలగుడ జైల్ కి రిమాండ్ కి తరలింపు.

- అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శాంపూర్ గ్రామానికి చెందిన కునమల్ల శ్రీనివాస రావు అనే వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ పేరు చెప్పి మోసం.

- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఫోన్ చేసి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారిగా పరిచయం చేసుకుంటున్నాడు.

- ముఖ్యంగా మహిళలకు ఫోన్ చేసి వారిలో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నామని అందుకు గాను కొంత ఖర్చు అవుతుందని చెప్తున్నాడు.

- అలా ఫోన లు వచ్చిన కొంతమని మంత్రి ఈటెల దృష్టికి తీసుకురావడంతో అతని మీద ఫిర్యాదు చేయాలని మినిస్టర్ PS కు ఆదేశించారు.

- ఆ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసు లు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి చంచలగుడా జైల్ కి తరలించారు.

- శ్రీనివాస్ మీద గతంలో 5 కేసులు ఉన్నట్టు పోలీస్ లు తెలిపారు.

- వైద్య ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న డాక్టర్స్, వైద్య సిబ్బంది , కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు , ట్రాన్స్ఫర్ లు, పోస్టింగ్స్ ఇప్పిస్తామని ఇలాంటి ఫోన్ కాల్స్   పట్ల జాగ్రత్తగా ఉండాలి

- ఇలాంటివి నమ్మకూడదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

- ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

- పోలీస్ లకు ఫిర్యాదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

2020-10-27 15:41 GMT

 కరీంనగర్ :

- బిజెపి అధికారప్రతినిది రాకేష్ కామెంట్స్

- షుగర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి ..

- కావాలనే ప్రభుత్వం స్పందిచకుండా బండి సంజయ్ ని హత్య చేయాలనీ చూస్తోంది

- ఇప్పటివరకు ప్రభుత్వ వైద్యులు ఎవరు ఎంపీ గా ఉన్న సంజయ్ ఆరోగ్యం పై ఆరా తీయలేదు...

- కార్యకర్తలు ఆందోళన చెందాలిసిన అవసరంలేదు....

- ప్రభుత్వం పై పోరాటం కొనసాగుతుంది

2020-10-27 15:37 GMT

  సిద్దిపేట జిల్లా //

- దుబ్బాక రెడ్డి సంక్షేమ భవన్ లో టి ఆర్ ఎస్ కు మద్దతు గా తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మంత్రి హరీష్ రావు గారు

- ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ..

- చేగుంట లో తన వ్యవసాయ బావులో ఎండిన పంటను తగలబెట్టి పంట లు ఎండయి అనడం సిగ్గు చేటని షబ్బీర్ అలీ పై మంత్రి హరిష్ రావు పైర్...

- ఇంత దిగజారిన రాజకీయాలు చేయడం సిగ్గు చేటాని మండి పడ్డారు..

- మీతో ఎంతో అనుబంధం ఉంది.. నాడు ఉద్యమం లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉన్నాం..

- టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక వర్గీకరణ కు మద్దతు ఇవ్వాలి అని అసెంబ్లీ తీర్మానం పెట్టి.. కేంద్రానికి పంపితే ఎలాంటి స్పందన లేదు.. తెలంగాణ ప్రభుత్వం   వర్గీకరణ పై పూర్తి స్పష్టత తో ఉంది..

- తెలంగాణ ఉద్యమంలో సింహాల లాగ గర్జించిన ఘనత మాదిగలది..

- కాంగ్రెస్, బిజెపి లు ఇదివరకు చేసింది లేదు.. ఇకముందు చేసేదేమి లేదు..

- అబద్దాలతో దుబ్బాక ప్రజలను మబ్యపెట్టే ప్రయత్నం బిజెపి చేస్తుంది.

- మిరుదొడ్డి లో బిజెపి కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు రఘునందన్ ..

- ఒక కార్యకర్తను కాపాడుకోలేని అభ్యర్థి రేపు ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు..

- పైసలు పోలీసులు తెచ్చిండ్రని నిన్న సిద్దిపేట లో ఆక్షన్ చేస్తే.. అసలు రంగు ఈరోజు బయట పడింది..

- ఆక్టింగ్ లో బిజెపి కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే..

- కెసిఆర్ ప్రభుత్వం లో 230 సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రారంభించారు..

- ఏక కాలంలో 30 మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు

2020-10-27 15:18 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

-24 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 95,50 మీటర్లు

-ఇన్ ఫ్లో 49,000 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 27,500 క్యూసెక్కులు

2020-10-27 15:00 GMT

మహబూబ్ నగర్--

-మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్...

-మహబూబ్ నగర్ పట్టణానికి ఉపాదినిచ్చే పరిశ్రమలు లేకపోయేవి.

400 ఎకరాల్లో ఐటీ కారిడార్ నిర్మిస్తున్నాం.

-పట్టణాన్ని అభివృద్ది పథంగా తీర్చిదిద్దుతున్నాం.

-ఐటి కారిడార్ మహబూబ్ నగర్ పట్టణానికే తలమానికంగా మారుతుంది.

-భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాం.

-మరో కొత్త ప్రాజెక్టును మహబూబ్ నగర్ కు తీసుకొస్తున్నాం... దీపావళి రోజున ప్రకటిస్తాం..

-ప్రాజెక్టుల పేర్లు ముందే చెప్తే రియర్టర్లు వాలిపోతున్నారు.

-మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే మా లక్ష్యం.

-పేద ప్రజలను మోసం చేసే వారిని ఎప్పుటికీ ఉపేక్షించబోం..

-పెద్దపెద్ద కంపెనీలు హైద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు తరలివస్తున్నాయి.. వారి కోసం వెయ్యెకరాలు సేకరించబోతున్నాం..

-ఐదు వేలవకోటేల పెట్టుబడులను ఆశిస్తున్నాం... ఇప్పటికి వెయ్యి కోట్లు పెట్టేందుకు కంపెనీలు రెడీ అయ్యాయి.

2020-10-27 14:53 GMT

జాతీయం..

-బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ బీసీ కమిషన్ సుమోటో కేసు

-తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు

-ఈ ఘటనపై నవంబర్ 5లోగా పూర్తి వివరాలు అందించాలని ఆదేశం

-దాడికి పాల్పడిన అధికారులు, పోలీసుల ఎందుకు కేసు నమోదు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు

-బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ హక్కులను రక్షించడమే బీసీ కమిషన్ రాజ్యాంగ విధి అని నోటీసులో స్పష్టం చేసిన బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి

2020-10-27 14:45 GMT

హైదరాబాద్..

-వారి నుంచి 40 గ్రాముల చరాస్ స్వాధీనం..

-మగళహట్ పోలీస్టేషన్ పరిధిలో అమ్ముతుండగా సూరజ్ సింగ్, లలిత్ కుమార్ లను పట్టుకున్న పోలీసులు..

-పది గ్రాములు 1800 రుపాయాలకు అమ్ముతున్నట్లు గుర్తించిన పోలీసులు ..

-మంగళహాట్ పోలీసులకు అప్పగించిన టాస్క్ఫోర్స్ పోలీసులు...

Tags:    

Similar News