Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧


ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Nizamabad Updates: సీఎం కేసీఆర్ ఏరియల్‌ సర్వేచేసి రైతులను ఆదుకోవాలి...
    27 Oct 2020 4:23 PM GMT

    Nizamabad Updates: సీఎం కేసీఆర్ ఏరియల్‌ సర్వేచేసి రైతులను ఆదుకోవాలి...

     నిజామాబాద్

    -అకాల వర్షాలు, దోమ పోటు వల్ల నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ కామెంట్స్..

    -వారితో పాటు పత్తి రైతులను కూడా వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి

    -మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగాల్సింది దుబ్బాకలో కాదు పంటపొలాల్లో

    -సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ప్రేమ రైతులపై లేదు

  • 27 Oct 2020 4:06 PM GMT

    Karimnagar Updates: బండి సంజయ్ ది దొంగ దీక్ష....

    కరీంనగర్ :.

    * సుడా ఛైర్మెన్ జివి రామకృష్ణ కామెంట్స్

    * బండి సంజయ్ ది దొంగ దీక్ష , మీ పార్టీ కార్యకర్తలకు డబ్బులతో ఓట్లను కొనండి అని ప్రోత్సహించడానికా మీ దీక్ష...

    * మీ చిల్లర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ దీక్ష,

    * మంత్రి హరీష్ రావు గారి సవాలును ఎదుర్కునే దమ్ము లేక ఈ వేషాలు వేస్తున్నారు...

    * ఎలక్షన్స్ దుబ్బాకలో జరిగితే దీక్ష రాజకీయాలు కరీంనగర్ లో చేస్తున్నారు ...

    * దుబ్బాకలో ప్రచారం చేసే పరిస్థితి లేక కరీంనగర్లో దొంగ దీక్ష చేస్తున్నారు

  • 27 Oct 2020 3:54 PM GMT

    Siddipet Updates: రాష్ట్ర నాయకుడు విరాహత్ అలీ వ్యాఖ్యలు..

    సిద్ధిపేట జిల్లా...

    *మీడియా,పత్రికా సంస్థల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ ,దుబ్బాక BJP అభ్యర్థి రఘునందన్ రావు పై TUWJ (I JU)   మండిపాటు..

    * సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో TUWJ (I JU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు కె. రంగాచారి,మీడియా అకాడమీ సభ్యులు కె.అంజయ్య తో పాటు సిద్ధిపేట జర్నలిస్టు ల ప్రెస్ మీట్.

    * మీడియాపై,పత్రికల పై అనుచిత వ్యాఖ్యలు BJP అధ్యక్షుడు బండి సంజయ్ తన స్థాయిని దిగజార్చు కున్నారు...

    * జర్నలిస్టుల ను మీడియా సంస్థలను బెదిరిస్తూ మాట్లాడడం అప్రజాస్వామికం..

    * బండి సంజయ్ తన స్థాయిని రాష్ట్ర స్థాయి నుండి గల్లీ స్థాయికి దిగజార్చుకున్నారు...

    * సిద్ధిపేట లో జరిగిన ఘటనను మీడియా సంస్థలకు,అక్కడి జర్నలిస్టు లకు అంటగట్టడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం..

    * తన వ్యాఖ్యల పై బండి సంజయ్ మీడియాకు,జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి..

    * సిద్ధిపేట జర్నలిస్టు ల పై BJP అభ్యర్థి రఘునందన్ రావు బెదిరింపులకు దిగడం,దుర్భాశలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..

    * రఘునందన్ రావు,ఆయన అనుచరులు సిద్ధిపేట జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి..

  • 27 Oct 2020 3:46 PM GMT

    Telangana Updates: వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్....

    - చంచలగుడ జైల్ కి రిమాండ్ కి తరలింపు.

    - అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శాంపూర్ గ్రామానికి చెందిన కునమల్ల శ్రీనివాస రావు అనే వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ పేరు చెప్పి మోసం.

    - కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఫోన్ చేసి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారిగా పరిచయం చేసుకుంటున్నాడు.

    - ముఖ్యంగా మహిళలకు ఫోన్ చేసి వారిలో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నామని అందుకు గాను కొంత ఖర్చు అవుతుందని చెప్తున్నాడు.

    - అలా ఫోన లు వచ్చిన కొంతమని మంత్రి ఈటెల దృష్టికి తీసుకురావడంతో అతని మీద ఫిర్యాదు చేయాలని మినిస్టర్ PS కు ఆదేశించారు.

    - ఆ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసు లు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి చంచలగుడా జైల్ కి తరలించారు.

    - శ్రీనివాస్ మీద గతంలో 5 కేసులు ఉన్నట్టు పోలీస్ లు తెలిపారు.

    - వైద్య ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న డాక్టర్స్, వైద్య సిబ్బంది , కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు , ట్రాన్స్ఫర్ లు, పోస్టింగ్స్ ఇప్పిస్తామని ఇలాంటి ఫోన్ కాల్స్   పట్ల జాగ్రత్తగా ఉండాలి

    - ఇలాంటివి నమ్మకూడదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

    - ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

    - పోలీస్ లకు ఫిర్యాదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

  • 27 Oct 2020 3:41 PM GMT

    Karimnagar Updates: బండి సంజయ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది...

     కరీంనగర్ :

    - బిజెపి అధికారప్రతినిది రాకేష్ కామెంట్స్

    - షుగర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి ..

    - కావాలనే ప్రభుత్వం స్పందిచకుండా బండి సంజయ్ ని హత్య చేయాలనీ చూస్తోంది

    - ఇప్పటివరకు ప్రభుత్వ వైద్యులు ఎవరు ఎంపీ గా ఉన్న సంజయ్ ఆరోగ్యం పై ఆరా తీయలేదు...

    - కార్యకర్తలు ఆందోళన చెందాలిసిన అవసరంలేదు....

    - ప్రభుత్వం పై పోరాటం కొనసాగుతుంది

  • Dubbaka Updates: ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు....
    27 Oct 2020 3:37 PM GMT

    Dubbaka Updates: ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు....

      సిద్దిపేట జిల్లా //

    - దుబ్బాక రెడ్డి సంక్షేమ భవన్ లో టి ఆర్ ఎస్ కు మద్దతు గా తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మంత్రి హరీష్ రావు గారు

    - ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ..

    - చేగుంట లో తన వ్యవసాయ బావులో ఎండిన పంటను తగలబెట్టి పంట లు ఎండయి అనడం సిగ్గు చేటని షబ్బీర్ అలీ పై మంత్రి హరిష్ రావు పైర్...

    - ఇంత దిగజారిన రాజకీయాలు చేయడం సిగ్గు చేటాని మండి పడ్డారు..

    - మీతో ఎంతో అనుబంధం ఉంది.. నాడు ఉద్యమం లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉన్నాం..

    - టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక వర్గీకరణ కు మద్దతు ఇవ్వాలి అని అసెంబ్లీ తీర్మానం పెట్టి.. కేంద్రానికి పంపితే ఎలాంటి స్పందన లేదు.. తెలంగాణ ప్రభుత్వం   వర్గీకరణ పై పూర్తి స్పష్టత తో ఉంది..

    - తెలంగాణ ఉద్యమంలో సింహాల లాగ గర్జించిన ఘనత మాదిగలది..

    - కాంగ్రెస్, బిజెపి లు ఇదివరకు చేసింది లేదు.. ఇకముందు చేసేదేమి లేదు..

    - అబద్దాలతో దుబ్బాక ప్రజలను మబ్యపెట్టే ప్రయత్నం బిజెపి చేస్తుంది.

    - మిరుదొడ్డి లో బిజెపి కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు రఘునందన్ ..

    - ఒక కార్యకర్తను కాపాడుకోలేని అభ్యర్థి రేపు ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు..

    - పైసలు పోలీసులు తెచ్చిండ్రని నిన్న సిద్దిపేట లో ఆక్షన్ చేస్తే.. అసలు రంగు ఈరోజు బయట పడింది..

    - ఆక్టింగ్ లో బిజెపి కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే..

    - కెసిఆర్ ప్రభుత్వం లో 230 సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రారంభించారు..

    - ఏక కాలంలో 30 మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు

  • Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...
    27 Oct 2020 3:18 PM GMT

    Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    -24 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 95,50 మీటర్లు

    -ఇన్ ఫ్లో 49,000 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 27,500 క్యూసెక్కులు

  • Mahabubnagar Updates: దివిటిపల్లిలో ఐటీ పార్క్ టవర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శ్రీనినాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్ రావు..
    27 Oct 2020 3:00 PM GMT

    Mahabubnagar Updates: దివిటిపల్లిలో ఐటీ పార్క్ టవర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శ్రీనినాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్ రావు..

    మహబూబ్ నగర్--

    -మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్...

    -మహబూబ్ నగర్ పట్టణానికి ఉపాదినిచ్చే పరిశ్రమలు లేకపోయేవి.

    400 ఎకరాల్లో ఐటీ కారిడార్ నిర్మిస్తున్నాం.

    -పట్టణాన్ని అభివృద్ది పథంగా తీర్చిదిద్దుతున్నాం.

    -ఐటి కారిడార్ మహబూబ్ నగర్ పట్టణానికే తలమానికంగా మారుతుంది.

    -భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాం.

    -మరో కొత్త ప్రాజెక్టును మహబూబ్ నగర్ కు తీసుకొస్తున్నాం... దీపావళి రోజున ప్రకటిస్తాం..

    -ప్రాజెక్టుల పేర్లు ముందే చెప్తే రియర్టర్లు వాలిపోతున్నారు.

    -మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే మా లక్ష్యం.

    -పేద ప్రజలను మోసం చేసే వారిని ఎప్పుటికీ ఉపేక్షించబోం..

    -పెద్దపెద్ద కంపెనీలు హైద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు తరలివస్తున్నాయి.. వారి కోసం వెయ్యెకరాలు సేకరించబోతున్నాం..

    -ఐదు వేలవకోటేల పెట్టుబడులను ఆశిస్తున్నాం... ఇప్పటికి వెయ్యి కోట్లు పెట్టేందుకు కంపెనీలు రెడీ అయ్యాయి.

  • 27 Oct 2020 2:53 PM GMT

    National Updates: బండి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ బీసీ కమిషన్ సుమోటో కేసు..

    జాతీయం..

    -బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ బీసీ కమిషన్ సుమోటో కేసు

    -తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు

    -ఈ ఘటనపై నవంబర్ 5లోగా పూర్తి వివరాలు అందించాలని ఆదేశం

    -దాడికి పాల్పడిన అధికారులు, పోలీసుల ఎందుకు కేసు నమోదు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు

    -బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ హక్కులను రక్షించడమే బీసీ కమిషన్ రాజ్యాంగ విధి అని నోటీసులో స్పష్టం చేసిన బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి

  • Hyderabad Updates: నిషేదిత చరాస్ ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు...
    27 Oct 2020 2:45 PM GMT

    Hyderabad Updates: నిషేదిత చరాస్ ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు...

    హైదరాబాద్..

    -వారి నుంచి 40 గ్రాముల చరాస్ స్వాధీనం..

    -మగళహట్ పోలీస్టేషన్ పరిధిలో అమ్ముతుండగా సూరజ్ సింగ్, లలిత్ కుమార్ లను పట్టుకున్న పోలీసులు..

    -పది గ్రాములు 1800 రుపాయాలకు అమ్ముతున్నట్లు గుర్తించిన పోలీసులు ..

    -మంగళహాట్ పోలీసులకు అప్పగించిన టాస్క్ఫోర్స్ పోలీసులు...

Print Article
Next Story
More Stories