Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧


ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 27 Oct 2020 2:41 PM GMT

    Vikarabad Updates: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో పురోగతి...

    వికారాబాద్.. 

    -సానియా మీర్జా ఫామ్ హౌస్ సెక్యురిటి అధికారి ఉమర్ కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు..

    -నాలుగు రోజుల క్రితం కాల్పులు చేసి అవును చంపిన సెక్యురిటి అధికారి..

    -స్పాట్ లో దొరికిన బులెట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు..

    -అతనికి వెపన్ ఎక్కడ నుండి వచ్చిందనే అంశం ప్రస్తుతం ఆసక్తి రిపోతోంది...

  • Rasamayi Balakishan: ఇంట్లో డబ్బులు అడ్డంగా దొరికితే మా డబ్బులు కావనడం సిగ్గుచేటు..
    27 Oct 2020 2:21 PM GMT

    Rasamayi Balakishan: ఇంట్లో డబ్బులు అడ్డంగా దొరికితే మా డబ్బులు కావనడం సిగ్గుచేటు..

    రసమయి బాలకిశన్ కామెంట్స్

    - కన్నీళ్లను కూడా ఎన్నికలకు వాడుకునే పరిస్థితి బిజెపికి దాపురించింది

    - డిపాజిట్ రాదనే విషయం తెలిసి ఏదో ఒక రకంగా బట్టకాల్చి మీదేస్తున్న బిజెపి

    - కరీంనగర్ లో ఉండి దుబ్బాకలో చిచ్చు పెట్టే ప్రయత్నం బండి సంజయ్ చేస్తుండు

    - అవన్నీ దుబ్బాక ప్రజలు తిప్పి కొడతారు

  • Padma Devender Reddy Commets: బిజెపి రఘునందన్ రావు ఐడ్రామ, నటన తో అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు...
    27 Oct 2020 2:11 PM GMT

    Padma Devender Reddy Commets: బిజెపి రఘునందన్ రావు ఐడ్రామ, నటన తో అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు...

    దుబ్బాక నీలకంఠ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, రసమయి బాలకిశన్ ప్రెస్ మీట్

    పద్మ దేవేందర్ రెడ్డి కామెంట్స్:

    - భర్త ను పోగుట్టుకున్న సుజాతక్క ఏడుపు ను ఎక్కిరించే రఘునందన్ రావు కు తగునా

    - నిన్న జరిగిన ఐడ్రామ లో బిజెపి వారు తేలు కుట్టిన దొంగలు

    - డికె అరుణ కు దుబ్బాక కోసం ఏమి తెలుసని మాట్లాడుతుంది?

    - దుబ్బాక ఉద్యమాల గడ్డ.. టిఆర్ఎస్ కు అడ్డ

    - ఎన్ని డ్రామాలాడిన 3వ తారీఖున దుబ్బాక ప్రజలు రఘునందన్ కు బుద్ధి చెబుతారు

  • Mahabubnagar Updates: మున్సిపాలిటిల్లో అత్యదిక ఇళ్ల నిర్మాణం జరిగింది మహబూబ్ నగర్ లోనే...
    27 Oct 2020 2:03 PM GMT

    Mahabubnagar Updates: మున్సిపాలిటిల్లో అత్యదిక ఇళ్ల నిర్మాణం జరిగింది మహబూబ్ నగర్ లోనే...

    మహబూబ్ నగర్--

    -మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్..

    -పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో అనేక అవాంతరాలు సృష్టించారు

    -ఏ అభివృద్ది చేద్దామన్నా ఆటంకాలు చేస్తున్నారు.

    -దివిటిపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ళను మాడల్ కాలనీగా ఏర్పాటు చేస్తాం

    -ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తాం

    -దీపావళికి డబుల్ బెడ్ రూం ఇళ్ళకు గృహప్రవేశాలు చేస్తాం

    -ప్రతి నిరుపేదకు ఇళ్ళు ఇస్తాం...

    -దళారులను నమ్మొద్దు.. మోసగాళ్లకు జైలు తప్పదు..

    -తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.

  • Talasani Srinivas Yadav Comments: నిన్న దుబ్బాక,సిద్దిపేట ఎపిసోడ్ అంతా చూశాం...
    27 Oct 2020 1:25 PM GMT

    Talasani Srinivas Yadav Comments: నిన్న దుబ్బాక,సిద్దిపేట ఎపిసోడ్ అంతా చూశాం...

    మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ @తెలంగాణ భవన్

    #ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి..

    #ఎలక్షన్ కమిషన్ లోబడి పనులు జరుగుతాయి..

    #ఎన్నికల సందర్భంగా సోదాలు జరగడం సర్వ సాధారణం

    #హరీష్ రావు,పద్మా దేవేందర్ రెడ్డి,సుజాత ఇంట్లో వాహనాల్లో కూడా సోదాలు జరిగాయి..

    #దీనికి మా ప్రభుత్వం కాబట్టి ఇలా చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు..

    #బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..

    #మీ క్యాడర్ ఎంత బలం ఎంత

    #మా క్యాడర్ 60 లక్షలు..

    #మీంలాగే ముట్టడి చేస్తాం అంటున్నారు మా వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..

    #ఎంపీ,కేంద్ర మంత్రి కూడా వెళ్లి నానా హైరానా చేశారు..

    #నిన్న పోలీసులు సెర్చ్ చేసి డబ్బులు తీశారు..

    #డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే కార్యకర్తలు పోలీసుల చేతిలో నుండి లాక్కొని వెళ్లారు..

    #5 లక్షలు అపహరణకు గురైంది.. అది పెద్ద క్రైమ్..

    #మాకు మెజారిటీ కచ్చితంగా వస్తుంది..

    #ప్రజలే మాకు బాసులు..

    #మేము చేసిన అబివృద్ది సంక్షేమ ఫలాలు మాకు గెలుపుని ఇస్తుంది..

    #బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు..

    #హైదరాబాద్ లో వరదలతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చాయి ప్రజలకు..

    #కానీ ఇప్పటికీ కేంద్రం నుండి రూపాయి సహాయం అందలేదు..

    #జీఎస్టీ నిధులే రాలేదు..

    #బీజేపీ నేతల మాటలు ఏకవచనంగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఉదయం నుండి..

    #దొంగతనం మీరు చేసి మాపై వేస్తున్నారు..

    #ఇది బలుపు కాకపోతే మరెంటి

    #బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.

    #కేంద్ర మంత్రి నిజానిజాలు తెలుసు కోకుండా అక్కడికి వెళ్లి ఏం చేశారు

  • Telangana Updates: దుబ్బాక ఉప ఎన్నికలు ఒక చరిత్ర ను సృష్టించబోతున్నాయి...
    27 Oct 2020 1:16 PM GMT

    Telangana Updates: దుబ్బాక ఉప ఎన్నికలు ఒక చరిత్ర ను సృష్టించబోతున్నాయి...

    -ఇంద్రసేనా రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు...

    -తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికలు ఒక చరిత్ర ను సృష్టించబోతున్నాయి...

    -టీఆరెస్ పతనానికి నంది పాలకబోతుంది...

    -ఎలాగైనా గెలవాలని మంద బలం తో బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు...

    -ఓటమి భయం పట్టుకొని బీజేపీ క్యాండేట్ కారు తో పాటు బంధువుల ఇళ్లపై ఏమి డబ్బులు దొరకాకపోతే పక్కింటి నుండి తీసుకువచ్చారు...

    -స్టార్ క్యాంపెయినర్ లు ఎక్కడికైనా వెల్లచ్చు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది...

    -వారిని అరెస్టు చేయడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట కి చేరుకోకముందే కమిషనర్ అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లారు...

    -మా కార్యకర్తలే డబ్బులు తీశారని చెప్పాలని పోలీసులు బలవంతపెడుతూ ,కొడుతూ వారి నుండి చెప్పేస్తున్నారు...

    -సీఈవో ను కలిసి వినతిపత్రం ఇచ్చాము...

    -లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు...

    -సెంట్రల్ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలి...

    -ఎన్నికల అబ్ జర్వ్ లాగానే పోలీసుల అబ్ జర్వ్ ఉండాలి...

    -సిద్దిపేట పొలీస్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి...

  • BJP MLC Ramchander Rao Comments: బీజేపీ కార్యకర్తల ను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..
    27 Oct 2020 1:12 PM GMT

    BJP MLC Ramchander Rao Comments: బీజేపీ కార్యకర్తల ను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..

    - బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు...

    - సిద్దిపేట లో మా అభ్యర్థి రఘునందన్ రావు తో పాటు బంధువుల ఇళ్లపై దాడులు అప్రజాస్వామిక చర్య...

    - పోలీసులు బయపెట్టేవిధంగా ప్రవర్తిస్తున్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా...?

    - దుబ్బాక లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది...

    - టీఆరెస్ ఓడిపోతుందని భయంతోనే ఇలాంటివి చేస్తున్నారు...

    - సీపీ ని వెంటనే బదిలీ చేయాలి సీపీ టీఆరెస్ కార్యకర్త గా పనిచేస్తున్నారు...

    - కలెక్టర్ ను బదిలీ చేయాలని చెప్పం చేశారు...

    - సీఈవో కి పిర్యాదు చేసాం...

    - మామీద తప్పుడు కేసులు పెడుతున్నారు...

    - సీబీఐ విచారణ చేపట్టాలి...

    - కేంద్ర బలగాలను దుబ్బాక లో నిలపాలి...

    - కేవలం బీజేపీ కార్యకర్తల పైనే వేధింపులు కొనసాగుతున్నాయి...

    - టీఆరెస్ పార్టీ ఈ ఆరు సంవత్సరాల్లో ఎక్కడ కూడా డబ్బులు లేకుండా గెలవలేదు...

    - టీఆరెస్ ఓట్లు కొనాలని చూస్తుంది..

    - ప్రజల సంకల్పం ముందు మీ డబ్బు పనిచేయదు...

  • Siddipet Updates: ఒక్క ఓటు రెండు రాష్ట్రలు అని చెప్పి మోసం చేసింది బీజేపీ...
    27 Oct 2020 12:46 PM GMT

    Siddipet Updates: ఒక్క ఓటు రెండు రాష్ట్రలు అని చెప్పి మోసం చేసింది బీజేపీ...

    సిద్దిపేట;

    * తొగుట యువజన సభలో మంత్రి హరీష్ రావు కామెంట్స్;

    * కేసీఆర్ ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా తెలంగాణ తెచ్చిండు. విశ్వసనీయతకు మారు పేరు టిఆర్ఎస్ పార్టీ..

    * డిసెంబర్ 9న తెలంగాణ కోసం మేము రాజీనామా చేస్తే.. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదు..

    * తెలంగాణా వచ్చాక నీళ్లు,నిధులు, నియామకాలు వచ్చాయి...

    * ఇప్పటికే టిఆర్ఎస్ అధికారంలో వచ్చాక రాష్ట్రంలో లక్ష 24 వేల 990 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం...

    * 8000 పరిశ్రమలను ఏర్పాటు చేసి 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం...

    * నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ తెస్తా అని చెప్పి ఎన్నికల్లో గెలిచాక అక్కడి ప్రజల్ని మోసం చేసాడు...

    * రాబోయే రోజుల్లో తొగుట మండల కేంద్రం మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది...

    * మల్లనసాగర్ పూర్తి అయితే ఎంతో మంది యువతకు లబ్ధి చేకూరుతుంది...

    * ముంపు గ్రామాల ప్రజలను కడుపులో పెట్టికొని చూసుకుంటా.. ముంపు గ్రామాలకు చెందిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా చేస్తా...

    * నిన్న సిద్దిపేటలో జరిగిన ఇష్యూతో బీజేపీ తనకు తానుగా సెల్ఫ్ గోల్ చేసుకుంది..

    * సిద్దిపేటలో దొరికిన డబ్బులు బీజేపీ పార్టీవి కాకపోతే ఆ పార్టీ నేతలు అక్కడికి ఎందుకు వెళ్లారు..?

    * దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ గెలిచే పార్టీ... బీజేపీ పార్టీ ఓడిపోయే పార్టీ... అందుకే వారు ఫ్రస్టేషన్ లో ఉన్నారు...

  • Vijayashanthi Comments: దుబ్బాక ఎన్నికల గురించి విజయశాంతి కామెంట్స్..
    27 Oct 2020 11:41 AM GMT

    Vijayashanthi Comments: దుబ్బాక ఎన్నికల గురించి విజయశాంతి కామెంట్స్..

    విజయశాంతి...

    * చైర్‌పర్సన్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ.

    * దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆరెస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

    * ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆరెస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది.

    * గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది.

    * ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా కాదా అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి.

  • Mahabubabad Updates: న్యూడెమోక్రసీ లో తిరిగి విలీనం అయిన ప్రజాసంఘాలు...
    27 Oct 2020 11:11 AM GMT

    Mahabubabad Updates: న్యూడెమోక్రసీ లో తిరిగి విలీనం అయిన ప్రజాసంఘాలు...

     మహబూబాబాద్ జిల్లా

    //బయ్యారం మండలం 5 సంవత్సరాల క్రితం సి.పి.ఐ. ( ఎం. ఎల్ ) న్యూడెమోక్రసీ నుండి విడిపోయిన ప్రజాసంఘాలు తిరిగి,

    ///న్యూడెమోక్రసీ లో విలీనం అయినట్లు బయ్యారం మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు వెల్లడి.

Print Article
Next Story
More Stories