Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
అనంతపురం:
- ఆస్పత్రి ఆవరణ లో విద్యత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు
- రెండు రోజుల కిందట రికార్డు రూమ్ లో షార్ట్ షార్క్యూట్ తో ప్రమాదం. ప్రమాదాన్ని వెంటనే గుర్తించడం తో తప్పిన ముప్పు.
విజయవాడ
- కనకదుర్గ ఫ్లైఓవర్ పై లోడ్ టెస్టింగ్ చేయనుండడంతో ట్రాఫిక్ డైవర్షన్
- హైదరాబాదు నుంచీ వచ్చే వాహనాలకు మళ్ళింపులు లేవు
- గుంటూరు నుంచీ వచ్చే వాహనాలకు పోలీసు కంట్రోల్ రూమ్ నుంచీ సీతార సెంటర్, గొల్లపూడి మీదుగా మళ్ళింపు
- ప్రకాశం బ్యారేజి నుంచీ వచ్చే వాహనాలు బీఆర్పీ రోడ్, చిట్టినగర్, సితారా సెంటర్ మీదుగా మళ్ళింపు
- ఏలూరు నుంచీ వచ్చే వాహనాలు ఇన్నర్ రింగ్, పైపుల రోడ్, సీవీఆర్ ఫ్లైఓవర్, సితారా సెంటర్, గొల్లపూడి మీదుగా మళ్ళింపు
విశాఖ:
- విశాఖ జిల్లాలో దారుణం.వాలంటీర్ భర్త చేయి నరికివేత.
- భీమిలి వార్డు వాలంటరీ హేమ భర్త శ్రీనివాసరావు చేయి నరికేసిన దుండగులు...
- నిడిగట్ఠు వార్డు వాలంటీర్ హేమను కొంతకాలంగా వేదిస్తున్న మాస్ చిన్న అనే వ్యక్తి....
- హేమ భర్త శ్రీనివాసరావు కు విషయం తెలపడంతో చిన్న ను మందలించిన శ్రీనివాస్...
- కక్షతో మాస్ చిన్న అనుచరులతో శ్రీనివాసరావు పై దాడి.
- దాడిని అడ్డుకున్న శ్రీనివాసరావు సోదరుడు ప్రసాద్ కు కూడా గాయాలు .
- క్షతగాత్రులు కింగ్ జార్జి ఆసుపత్రి కి తరలింపు .
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్ప భీమిలి పోలీసులు
శ్రీకాకుళం జిల్లా..
-సోంపేటలో 19 మంది వాలంటీర్ లను విధుల నుంచి తొలిగించిన అధికారులు..
- కోవిడ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున తొలగింపు..
- వాలంటీర్ లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు..
తూర్పు గోదావరి..
- కాకినాడ: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవం సందర్భంగా కాకినాడ GGH సూపరిండెంట్ డా. రాఘవేంద్రరావు కి 20 ఆక్సిజన్ యూనిట్ లు అంద చేసిన జన సేన నాయకుడు పంతం నానాజి తదితరులు.
అనంతపురం:
* జిల్లాలో సెబ్ ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగిన దాడులు, స్వాధీనం వివరాలు
* నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 1700 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు.
* 1056 టెట్రా పాకెట్లు, 38 మద్యం సీసాలు, 88 లీటర్ల నాటు సారా స్వాధీనం.
* 21 కేసులు నమోదు... 27 మంది అరెస్టు...09 వాహనాలు సీజ్
* ఇసుక అక్రమాలపై చర్యలు..
* 3 కేసులు నమోదు... ఏడుగురు అరెస్టు
* ఒక జె.సి.బి, 4 ట్రాక్టర్లు స్వాధీనం... 15 టన్నుల ఇసుక స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా..
- జిల్లాలో విజృంభిస్తున్న కరోనా..
- గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 846 పాజిటివ్ కేసులు నమోదు..
- దీంతో జిల్లా వ్యాప్తంగా 21,095 కి చేరిన కరోనా కేసుల సంఖ్య..
- ఈరోజు కరోనా నుంచి కోలుకుని 523 మంది డిశ్చార్..
- ప్రస్తుతం జిల్లాలో 5,878 ఆక్టీవ్ కేసులు..
అమరావతి.
- పశుసంవర్ధక, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
- పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు.
విజయవాడ
- "మాస్కే కవచం" పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడి
- విజయవాడలోని ఆర్ &బి బిల్డింగ్ కొవిడ్ కమాండ్ సెంటర్ లో ప్రచార కార్యక్రమాన్ని ప్రాంభించిన మంత్రి ఆళ్ల నాని
- అధ్యక్షత వహించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి
- కొవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
- ఉపయోగించిన మాస్కుల్ని మూడురోజులపాటు మూసిన కవర్లో ఉంచి పారవేయండి మంత్రి ఆళ్ల నాని
- ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదు
- మీ ఇళ్లల్లో వయసు మీరిన వారికి కొవిడ్ వ్యాప్తి చెందకుండా యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
- బయటికి వెళ్లినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి మంత్రి ఆళ్ల నాని
- మాస్కుల వల్ల ప్రయోజనాల్ని వైద్య ఆరోగ్య శాఖ తో పాటు మిగతా ప్రభుత్వ శాఖలన్నీ అవగాహన కల్పిస్తున్నాయి
నెల రోజుల విస్తృత ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలి
మంత్రి ఆళ్ల నాని
నెల్లూరు:
-- జిల్లాలో కొనసాగుతున్న కరోనా విలయం..
-- ఈవాళ రికార్డు స్థాయిలో 1234 మందికి సోకిన మహమ్మారి.
-- జిల్లాలో 26,893 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య.