Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-23 00:23 GMT
Live Updates - Page 2
2020-08-23 15:26 GMT

Corona Updates in India: దేశంలో క‌రోనా విభృంజ‌న‌

ఢిల్లీ: 61 వేలు దాటిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య

• దేశ రాజధానిలో గడచిన 24 గంటలలో 1450 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు.

. గడచిన 24 గంటలలో డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1250

• గడచిన 24 గంటలలో “కరోనా” కారణంగా 16 మంది మృతి.

• దేశ రాజధానిలో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 1,61,466

మొత్తం మృతుల సంఖ్య 4,300

ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,45,388

• ఢిల్లీ లో “యాక్టివ్” కేసుల సంఖ్య 11,778

• ఢిల్లీ లో ఈరోజు నిర్వహించిన “కరోనా” RTPCR టెస్ట్ ల సంఖ్య 6261

. ఢిల్లీ లో ఈ రోజు నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ ల సంఖ్య 12,470

• దేశరాజధానిలో ఇప్పటి వరకు నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 14,31,094

. దేశ రాజధాని లో హోం ఐసోలేషన్ లో ఉన్న కేసుల సంఖ్య 5,896

. ఢిల్లీ లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 627

. ఢిల్లీ లో ప్రభుత్వ / ప్రైవేట్ హాస్పటల్స్ లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 14,126

ప్రతి మిలియన్ జనాభాలో కరోనా టెస్ట్ ల సంఖ్య 75,320

దేశరాజధానిలో రికవరీ రేటు శాతం 90.08

2020-08-23 15:21 GMT

Red Sndle Smugglers Arrested: ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్

కడప : నందలూరు మండలం ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన 5 ఎర్రచందనం దుంగలు, 5 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..

పట్టుబడిన ఎర్రచందనం దుంగలు, స్మగ్లర్లను మీడియా ముందు ప్రవేశ పెట్టిన రాజంపేట డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి..

2020-08-23 15:18 GMT

Krishna District JC Visiting: కృష్ణానది ముంపు గ్రామాల రైతులతో మాట్లాడిన జేసీ మాధవీలత

కృష్ణా జిల్లా : తోట్లవల్లూరు(మ) ముంపు ప్రమాదమున్న లంక గ్రామాల రైతులతో మాట్లాడిన జేసీ మాధవీలత

ఎన్డీ ఆర్ ఎఫ్ బోటులో కృష్ణ నది దాటి ఆవలి వైపునకు వెళ్ళిన జేసీ మాధవీలత

రైతులతో మాట్లాడి సమస్యలు, ప్రమాద పరిస్ధితులను తెలుసుకున్న మాధవీలత


 

2020-08-23 15:14 GMT

Pulichinthala Project Updates: పులిచింతల ప్రాజెక్టు కు భారీగా వస్తున్న వరదనీరు

గుంటూరు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో ని పులిచింతల ప్రాజెక్టు కు భారీగా వస్తున్న వరదనీరు..

జలకళతో కళకళలాడుతున్న పులిచింతల రిజర్వాయర్..

కృష్ణమ్మ కు జలహారతి ఇచ్చిన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు..

2020-08-23 15:12 GMT

Ananthapuram: అనంతపురంలో సెబ్ దాడులు

అనంతపురం: జిల్లాలో సెబ్ ఆధ్వర్యంలో ఈరోజు కొనసాగిన దాడులు, స్వాధీనం వివరాలు

* 5,322 టెట్రా పాకెట్లు, 25 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం.

* 19 కేసులు నమోదు... 39 మంది అరెస్టు...19 వాహనాలు సీజ్

ఇసుక అక్రమాలపై చర్యలు..

* ఒక కేసు నమోదు... ఒకరు అరెస్టు

* ట్రాక్టర్ స్వాధీనం... ఒక టన్ను ఇసుక స్వాధీనం

2020-08-23 15:07 GMT

Alcohol Seize: అక్ర‌మంగా త‌రలిస్తున్న మ‌ద్యం ప‌ట్టివేత‌

అనంతపురం :  కారులో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

175 కర్ణాటక మద్యం ప్యాకెట్లుతో పాటు మల్లేపూల సంచులు, షిఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్న విడపనకల్లు పోలీసులు.

2020-08-23 15:02 GMT

Police Raids:పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

అనంతపురం : కూడేరు మండలం అరవకూరు వద్ద పేకాట స్థావరాలపై కూడేరు పోలీసులు దాడులు.

పేకాట ఆడుతున్న 16 మంది అరెస్ట్. 24,600 రూ" నగదుతో పాటు 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం.

దడి 

2020-08-23 15:00 GMT

Laxmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

ప్రస్తుత సామర్థ్యం 95.30 మీటర్లు

పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

ప్రస్తుత సామర్థ్యం 5.02 టీఎంసీ

ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4,33,800 క్యూసెక్కులు

2020-08-23 14:57 GMT

Saraswati Barrage Upadates: సరస్వతి బ్యారేజ్ 12 గేట్లు ఎత్తిన అధికారులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 

సరస్వతి బ్యారేజ్ 12 గేట్లు ఎత్తిన అధికారులు

పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

ప్రస్తుత సామర్థ్యం 116.200 మీటర్లు

పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

ప్రస్తుత సామర్థ్యం 5.40 టీఎంసీ

ఇన్ ఫ్లో 31,000 క్యూసెక్కులు

ఓట్ ఫ్లో 25,000 క్యూసెక్కులు

2020-08-23 14:52 GMT

Ration Rice Seize: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

పొదలకూరులో 3,500 కేజీల రేషన్ బియ్యం పట్టివేత.

వెంకటగిరి నుంచి నెల్లూరు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.

అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పొదలకూరు పోలీసులు..

ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు అధికారులు


Tags:    

Similar News