Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-22 01:40 GMT
Live Updates - Page 2
2020-08-22 11:24 GMT

మహబూబాబాద్ :

- మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తాళ్లూరి బాబు గుండెపోటుతో మృతి

- సంతాపం ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్

2020-08-22 11:23 GMT

Nirmal: నిర్మల్ కడెం ప్రాజెక్టు బారీగా చెరుతున్నా వరదనీరు..

- నిర్మల్ కడెం ప్రాజెక్టు బారీగా చెరుతున్నా వరదనీరు..

- కుడి,ఎడమ కాల్వలకు నుండి పంటల కోసం నీటిని విడుదల చేస్తున్నా అదికారులు.

- కుడి కాల్వ నుండి 14 క్యూసెక్కుల నీరు

- ఎడమ కాల్వ. నుండి 590 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అదికారులు

- ఉన్నాతాదికారుల అదేశం మేరకు పంటపోలాలకు నీటిని విడుదల చేసి‌న అదికారులు

2020-08-22 11:22 GMT

- నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట:- అగ్ని ప్రమాదానికి గురైన శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సి ఐ డి. విచారణ అధికారి గోవింద్ సింగ్, ఐజీ సుమతీ బృందం

2020-08-22 11:21 GMT

ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి ల అరెస్ట్ లు అక్రమం..

- ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి ల అరెస్ట్ లు అక్రమం..

- ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్..

- శ్రీశైలం లో జరిగిన దుర్ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిల అరెస్టులు అక్రమం..

- ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారు. ఇది హక్కులను హరించివేయుడమే...

- వెంటనే ప్రజా ప్రతినిధులను అక్కడకి పంపి పరిశీలించేలా అవకాశం ఇవ్వాలి.

2020-08-22 11:20 GMT

- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లో గొనె విద్యాసాగర్ రావు ఇంటి తో పాటు మరో ఇంట్లో పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ముగ్గురు పరారీ,

- 2 లక్షల 70 వేల 250 రూపాయలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు,

- గతంలో పలు జిల్లాల్లో పట్టుబడిన పేకటారాయుళ్లని తేల్చిచెప్పిన- రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ

2020-08-22 11:20 GMT

Warangal: గిరిప్రసాద్ నగర్ కాలనీలో విషాదం

వరంగల్ అర్బన్:

- గిరిప్రసాద్ నగర్ కాలనీలో విషాదం

- పొంగుతున్న నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి.

- అధికారుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆగ్రహం.

2020-08-22 11:18 GMT

Khairatabad: ఖైరతాబాద్ గణేష్ కు భారీగా చేరుకున్న భక్తులు

ఖైరతాబాద్

- ఖైరతాబాద్ గణేష్ కు భారీగా చేరుకున్న భక్తులు

- ప్రస్తుతం దర్శనం ఆపేసిన నిర్వాహకులు

- సాయంత్రం తరువాత మళ్ళి దర్శనం ఉంటుంది అని చెప్పనప్పటికినీ పెద్ద ఎత్తున గుమి కూడిన భక్తులు

2020-08-22 11:17 GMT

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్:

- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

- ఇన్ ఫ్లో 40 వేల క్యుసెక్కులు

- ఔట్ ఫ్లో 863 క్యూసెక్కుల

- పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

- ప్రస్తుత నీటి మట్టం 1087 అడుగులు

- నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు

- ప్రస్తుతం 73 టిఎంసీ లు

2020-08-22 10:07 GMT

Congress Leaders: డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

- డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

- డిజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్, అనిల్ కుమార్ యాదవ్,కిరణ్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు..

- డిజీపీ కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు..

- డిజీపీ అపాయింట్ మెంట్ లేదన్న పోలీసులు..

- శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పై వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి , మల్లు రవి ఇతర కాంగ్రెస్ నేతలు అరెస్ట్ చేయడం పై డిజీపీ ని కలవడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు...

- డిజీపీ ఇంటి దగ్గర అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.

- అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను పంజాగుట్ట పీఎస్ కు తరలించిన పోలీసులు.

2020-08-22 09:37 GMT

సిద్దిపేట;

- ఈనెల 16వ తేదిన దర్గాపల్లి వాగులో గల్లంతు అయిన జంగపల్లి శ్రీనివాస్, తంగళ్లపల్లి నివాసి, మృతదేహం దర్గాపల్లి వాగు, సికింద్లాపూర్ శివారులో లభ్యం...

Tags:    

Similar News