Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-18 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-18 11:07 GMT

జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.

మేయర్ బొంతు రామ్మోహన్..

-భట్టి విక్రమార్క మాటలను ప్రజలు ఎవరు నమ్మారు.

-ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ను భట్టి చూడకుండా తప్పించుకొని పోయాడు.

-కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతున్నరు.

-కొల్లూరు లో సకల సౌకర్యాలతో పేద ప్రజలకు ఇండ్లు కట్టించాము.

-రాజకీయల నాయకుల ప్రమేయం లేకుండా, పూర్తిగా అధికారుల ద్వార పారదర్శకంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాము.

2020-09-18 11:04 GMT

-జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,   మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.

మంత్రి మల్లారెడ్డి ..

-జి హెచ్ ఎం సి పరిధిలో స్థలాలు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే.

-సీఎం కేసీఆర్ పేదలు గౌరవం గా ఉండాలని డబుల్ బెడ్ ఇండ్లు నిర్మాణాలు చేశారు.

-కాంగ్రెస్ పార్టీ వైఖరి చేసి ప్రజలు విసుకుంటున్నారు.

-పేదల కోసం కట్టిన ఇండ్లు చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారు.

2020-09-18 10:59 GMT

సంగారెడ్డి జిల్లా..

జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో కొల్లూరు లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

-కొల్లూరు లో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళ ఖండం.

-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుడా హైద్రాబాద్ నిరుపేదల కోసం 15 శివారు ప్రాంతాల్లో 33550 ఇండ్లు నిర్మాణం చేశారు.

-నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో స్థానికులకు 10 శాతం, హైదరాబాద్ వారికి 90 శాతం మందికి కేటాయిస్తాము.

-ప్రభుత్వం బాధ్యత గా నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ నిర్మాణలు చూపెడుతామని చెప్పిన వినలేదు.

-పెద్దవాళ్ళ గొప్పగా బతకాలని పూర్తిగా ఉచితంగా ఇండ్ల నిర్మాణం చేసాము.

-పేద వాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఆలోచన చేయలేదు.

-70 వేల కోట్లతో హైదరాబాద్ మహానగరంలో సమగ్ర అభివృద్ధి చేసాము.

2020-09-18 10:46 GMT

హైద్రాబాద్..

-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిపిస్తామని చెప్పి, అమాయకులను మోసం చేసి లక్షలు కాజేసిన ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు..

-ముగ్గురు సభ్యులు గల ఈ ముఠా లక్నో కేంద్రం గా పనిచేస్తుంది...

-లక్నో కు చెందిన షాను అన్సారీ, రిషబ్ మల్హోత్రా, వైభవ్ మహాజన్ ముగ్గురు కూడా విద్యార్థులే...

-లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది నిరుద్యోగులను చీటింగ్ చేశారు...

-కెరియర్ సైట్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి నిరుద్యోగులను టార్గెట్ చేసుకునేవారు..

-నౌకరీ డాట్ కాం, టైమ్స్ జాబ్ డాట్ కాం వెబ్ సైట్ లలో ఉద్యోగం కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటరో వారి వివరాలు తీసుకుని మోసం చేశారు...

-నగరంలోని ఒక మహిళకు MNC కంపెనీ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తం అని చెప్పి 38 లక్షలు కాజేసిన ముఠా..

2020-09-18 10:35 GMT

-నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు మద్దతు ఇవ్వాలని

-కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్ లిఖితపూర్వకంగా విజ్ఞాపనాపత్రాలను అందజేసింది...

-టీపీసీసీకీ, ఎఐసీసీకీ ఇదివరకే లేఖలు అందజేసింది టీజేఎస్.

-తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు ఉద్యమ సారథి అయిన కోదండరాం ఎమ్మెల్సీగా గెలుపొందడం అవసరమనీ,

-యువత, నిరుద్యోగులకు ఆయన మండలిలో సరైన ప్రాతినిధ్యం వహిస్తారని,

-ఈ విశాల ప్రయోజనాల దృష్ట్యా కోదండరాం కు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు

-లిఖితపూర్వకంగా వినతి పత్రాలను అందజేశారు....

-ఈ బృందంలో జి. వెంకట్ రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేష్, శ్రీశైల్ రెడ్డి ఉన్నారు....

-అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించారని ప్రతినిధి బృందం తెలియజేసింది....

2020-09-18 10:24 GMT

-హైదరాబాద్ నగర శివారు కొల్లూరు లో డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల ను పరిశీలించిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్

-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్..

-144 ఎకరాలకు పైగా స్థలం లో 15560 ఇళ్లు

-స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి చాలా సౌకర్యాలు వస్తాయి

-కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో నిర్మించిన 33558 ఇళ్లు కడతామని చెప్పారు

-కాంగ్రెస్ వాళ్ళ స్థాయికి తగ్గి ఇంటికి వెళ్లి ఆహ్వానించాం

-వాళ్ళు కావాలనే తప్పించుకోడానికి ప్రయత్నాలు చేశారు

-శివారు ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లల్లో 90% హైదరాబాద్ వాసులకే అని ఆనాడే చెప్పాం

-ప్రభుత్వ సంకల్పంతో వారిని ఆహ్వానిస్తే మేము పారిపోయాం అంటున్నారు...వారిని సాదరంగా పంపించాం

-ఒక్క బట్టి విక్రమార్క కే కాదు, దేశ ప్రధానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం.. ఇలాంటి ఇళ్లు ఎక్కడా లేవు

2020-09-18 10:11 GMT

టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ..

-రాష్ట్రంలో మహిళా కమిషన్ ను ఏర్పాటు చేయాలని టీడీపీ టీఎస్ మహిళా విభాగం శాంతియుతంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన  తెలుపుతుంది...

-నిరసన తెలుపుతున్న మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్నా ను, తెలుగుమహిళా కమిటీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా     ఖండిస్తున్నాం..

-అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ...

2020-09-18 10:04 GMT

కామారెడ్డి :

జుక్కల్..

-జుక్కల్  బిచ్కుంద మండల కేంద్రం లో నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,

-జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్.

-భారీ వర్షం కారణంగా నష్టపోయిన పంటలు, తెగిపోయిన రోడ్లు అంశం పై అధికారులతో అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్.

2020-09-18 09:59 GMT

ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు..

#క్రిస్టియన్లు శాంతిని ప్రేమించే వారు

#రాష్ట్రం లో టిఆర్ఎస్ అధికారం లోకి రావాలని క్రిస్టియన్లు చర్చిల్లో ప్రార్థనలు చేశారు

#గ్రామాల్లో చర్చిల నిర్మాణానికి పంచాయతీ అనుమతి సరిపోతుందని ప్రభుత్వం జీవో ఇవ్వడం సంతోషం

#స్మశాన వాటికలకు స్థలం కూడా ఉదారం గా కేటాయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే

#పాస్టర్లకు కరోనా సమయం లో ఇబ్బందులు ఎదురయ్యాయి ..వారిని ప్రభుత్వం ఏ రూపం లోనైనా ఆదుకోవాలి

2020-09-18 09:52 GMT

బి .వినోద్ కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్:

#సీఎం కెసిఆర్ నాయకత్వం లోని తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు

#కోవిడ్ నేపథ్యంలో ప్రపంచమంతా ఆర్ధిక రంగం లో మందగమనం నెలకొంది

#ఈ కోవిడ్ లోనూ రాష్ట్రం లో అభివృద్ది ,సంక్షేమం ఆగలేదు

#వంద దేశాల కన్నా జనాభా లో హైదరాబాద్ పెద్దగా ఉంటుంది

#కోవిడ్ పరిసితుల్లోనూ హైదరాబాద్ లో వినూత్న అభివృద్ధి పనులు కొనసాగడానికి మంత్రి కేటీఆర్ ఆలోచనా విధానమే కారణం

#హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది

#క్రిస్టియన్ల సమస్యల పరిష్కారం పై సీఎం కెసిఆర్ చిత్తశుద్ధి తో ఉన్నారు

#ఉద్యమ సమయం లో కెసిఆర్ ఏం చెప్పారో అన్ని వర్గాల సంక్షేమం కోసం అదే చేస్తున్నారు

Tags:    

Similar News