Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-17 01:18 GMT
Live Updates - Page 2
2020-09-17 09:54 GMT

Bhatti Vikramarka: నిన్న శాసనసభ లో రెండు లక్షల 68వేల ఇళ్ళు పేదలకు ఇవ్వనున్నాం అని చెప్పారు..భట్టి. విక్రమార్క సీఎల్పీ నేత..

భట్టి. విక్రమార్క సీఎల్పీ నేత..

-ఇప్పటికే లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

-అసెంబ్లీ లో తలసాని గారి ఆహ్వానం మేరకు మేము అనేక ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించాం..

-3428ఇళ్ళను ఇప్పటివరకు మాకు చూపించారు..ఇంకా మిగిలిన ఇళ్ళను చూపించాలి..

-నాతోపాటు క్వాలిటీ టీం ను కూడా తీసుకువచ్చా..వారు రిపోర్ట్ ఇచ్చాక డబుల్ బెడ్ రూం ఇళ్ళ గురించి మాట్లాడతాం..

-ఎప్పుడు ఇళ్ళ పంపిణీ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది..

-రాజీవ్ గృహ కల్ప ఇళ్ళ ను మేము పూర్తి చేసినా..వాటిని పంపిణీ చేయలేదు..

-పూర్తైన ఇళ్ళ ను పంపిణీ చేయకపోవడం తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.. అద్దె లు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని మాకు చెప్తున్నారు..

2020-09-17 09:16 GMT

కోవిడ్ పేషెంట్స్ యొక్క CT వాల్యూను RTPCR రిపోర్ట్ లో చూపించడం లేదంటూ హైకోర్ట్ లో పిల్..తీగల రామ్ ప్రసాద్ గౌడ్..

టీఎస్ హైకోర్టు....

-ప్రజా ప్రయోజన వాజ్యం ధాఖలు చేసిన తీగల రామ్ ప్రసాద్ గౌడ్ న్యాయవాది..

-పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ

-తదుపరి విచారణ ఈ నెల 24వ తేదికి వాయిదా వేసిన హైకోర్ట్.

2020-09-17 09:13 GMT

LRS Amendment: LRS సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

LRS సవరణ ఉత్తర్వులు.. 

-రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా రుసుము వసూలు

-2015 నాటి lrs స్లాబ్ లతో క్రమబద్ధీకరణ రుసుం.

-చ. గజం మార్కెట్ ధర. మూడు వేల వరకు 20శాతం క్రమబద్ధీకరణ రుసుం.

-రూ.3001 నుంచి 5 వేల వరకు 30 శాతం క్రమబద్ధీకరణ రుసుం.

-రూ.5001 నుంచి పదివేల వరకు 40 శాతం క్రమబద్దీకరణ రుసుము

-రూ. 10,001 నుంచి 20 వేల వరకు 50 శాతం క్రమబద్దీకరణ రుసుము.

-₹20,001 నుంచి 30 వేల వరకు 60 శాతం క్రమబద్దీకరణ రుసుము.

2020-09-17 07:23 GMT

Nirmal District updates: బైంసా పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

నిర్మల్ జిల్లా..

-తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మర్వో కార్యాలయం పై జాతీయ జెండాను అవిష్కరించడానికి యత్నించిన. బిజెపి కార్యకర్తలు..

‌-అడ్డుకున్న పోలీసులు

-ముప్పై మంది బిజెపి ‌ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

2020-09-17 07:21 GMT

C Venkat Reddy: నూతన విద్యుత్ సవరణ చట్టం అసెంబ్లీలో తీర్మానం అసంబద్ధమైనది: చాడ వెంకట రెడ్డి..

చాడ వెంకట రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...

-నూతన విద్యుత్ సవరణ చట్టం అసెంబ్లీలో తీర్మానం అసంబద్ధమైనదని, చట్టం ఆమోదం పొందే ముందు తీర్మానం చేయడంలో ఆంతర్యమేమిటని బిజెపి     రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించడం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.

-విద్యుత్ సవరణ చట్టాన్ని అభిప్రాయ సేకరణ నిమిత్తం అందరికీ పంపారు...

-చాలా పార్టీలు తమతమ అభిప్రాయాలను వ్యక్తపరచాయి...

-అలాగే తెలంగాణ శాసనసభలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీర్మానం చేస్తే తప్పేమిటని సిపిఐ ప్రశ్నిస్తుంది...

-ఈ విద్యుత్ సవరణ చట్టం వలన రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు....

-ప్రజల యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుంది....

-అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని సమర్ధిస్తుంది...

-ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఐ విజ్ఞప్తి...

2020-09-17 07:11 GMT

Guntur updates: హిందూ దేవాలయాల పై దాడులు జరగడాన్ని నిరసిస్తూ టిడిపి ధర్మపోరాట కార్యక్రమం..

గుంటూరు...

-విధ్యానగర్ సాయిబాబు గుడి వద్ద నిరసన తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,టిడిపి నేతలు.

-మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్...

-కులాలను మతాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.

-పదహారు నెలల్లో అనేక దేవాలయాల పై దాడులు జరిగాయి.

-లౌకకి వాదానికి విఘాతం కలిగించేలా పాలన చేస్తున్నారు...

-తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారు.

-దాడుల పై దేవాదాయ శాఖ మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.

-మతత్వాన్ని రెచ్చగొట్టేందుకే రధం వివిధ కారణాలతో కాలిపోయిందని చెప్తున్నారు.

-ప్రతి పండగకు దుర్గ గుడిలో రధం బయటకు తీస్తారు.

-అలాంటిది రధం సింహాలు మాయమయ్యాయి.

-దాచిన సింహాలను బయటకు తీయాలి.

-ఇన్సూరెన్స్ వస్తుందని మంత్రి మాట్లాడడం అన్యాయం.

-ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదు.

-ముఖ్యమంత్రి స్పందించకుంటే హిందూ మతాన్ని అణచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే భావన వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.

2020-09-17 07:05 GMT

Hyderabad Latest news: జియాగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సందర్శించిన కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతలు....

-బట్టి విక్రమార్క..

-అక్కడి పరిస్థితి అడిగి తెలుసుకున్న బట్టి...

-జియాగూడ నుంచి గోడ కి కబర బయలుదేరిన నేతలు.

-మాకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చూపిస్తామన్నారు... జియాగూడ లో పాత లబ్ధిదారులు పోను 270 మాత్రమే చూపారు..

-ఈరోజు కొన్ని ప్రాంతాలు చూపే రేపు మరికొన్ని ప్రాంతాల్లో చూపిస్తామని అంటున్నారు.

2020-09-17 06:28 GMT

Telangana Latest news: భారతదేశంలో విలీనం కోసం ఆనాడు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాలు చిరస్మరణీయం":జి. కిషన్ రెడ్డి..

జాతీయం..

- జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

-హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం సందర్భంగా, శ్రీ సోయం బాపురావు, శ్రీ వివేక్ లతో కలిసి నా నివాసంలో భారత జాతీయ జెండాను ఆవిష్కరించాను.


2020-09-17 06:25 GMT

Warangal District updates: తెలంగాణా విమోచన దినోత్సవం సందర్బంగా జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నాయని రాజేందర్ ఆధ్వర్యంలో డీసీసీ భవన్ లో జాతీయ జండా ఆవిష్కరణ..

వరంగల్ అర్బన్..

-తెలంగాణ విమోచన దినం సందర్భంగా బీజేపీ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయం-లో జాతీయ జెండా ఎగురవేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మా..

-పాల్గొన్న కార్యకర్తలు..

2020-09-17 06:11 GMT

Mahabubabad District updates:తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగాజాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్...

మహబూబాబాద్ జిల్లా...

-తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లో బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండాను ఎగురవేసిన, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్...

Tags:    

Similar News