Live Updates: ఈరోజు (15 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-15 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 15 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య ఉ.11-24 తదుపరి శుక్లపక్ష పాడ్యమి | విశాఖ నక్షత్రం రా.7-11 తదుపరి | వర్జ్యం రా.10-56 నుంచి 12-25 వరకు | అమృత ఘడియలు రా.10-58 నుంచి 12-28 వరకు | దుర్ముహూర్తం సా.3-51 నుంచి 4-36 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.06-08 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-15 05:47 GMT

  విశాఖ....

- విశాఖ సిరిపురంలో vmrda స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్న, vmrda అధికారులు

- భారీగా పోలీసులు మోహరింపు.

- ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 2024 వరకు, లీజు ఉన్నప్పటికీ నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు అంటూ యజమాని హర్ష     ఆరోపణ.

- లీజు అయిపోవడంతోనే ఖాళీ చేయిస్తున్నారు అంటున్న అధికారులు

2020-11-15 03:38 GMT

అమరావతి

 టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్క్రోలింగ్ పాయింట్స్:

• తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

• తణుకు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరనీయం.

• రాజాగారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.

• ఎల్లవేళలా ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.

• రాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

2020-11-15 03:07 GMT

 విజయవాడ...

- విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి చర్యలు చేపట్టండి.

- గత నెల 19 నుండి విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఆందోళన చేపట్టారు.

- యాజమాన్యం, జెఏసిల మధ్య అక్టోబరు 28న జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

- దీంతో విద్యుత్ ఉద్యోగులు పోరాటానికి సమాయత్తమవుతున్నారు.

- 2003 విద్యుత్ చట్టానికి 2020 పేరుతో సవరణలు చేయటం తగదు.

- జెన్కో ఆధ్వర్యంలోని ఆర్టీపీపీలో, ఎన్ టి పి ఎస్ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభించాలి.

- కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.

2020-11-15 03:01 GMT

   నెల్లూరు:

-- ఇన్ ఫ్లో 7657 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3770 క్యూసెక్కులు.

-- ప్రస్తుత నీటి మట్టం 75.942 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.

2020-11-15 02:19 GMT

  విజయనగరం...

- అర్దరాత్రి గర్బిణి మహిళకు పురిటినొప్పులు రావడంతో టార్చిలైట్లతో డోలీలో 10 కిలోమీటర్ల కొండదించిన వైనం.

- దబ్బగుంట వరకు డోలీలో మోసుకుంటూ వచ్చి అక్కడ నుండి ఆటోలో శృంగవరపుకోట హస్పటలకు తరలింపు.

- రహదారి సౌకర్యం లేక అను నిత్యం గిరిజనులకు వైద్యం కోసం తప్పని డోలీ మోతలు.

2020-11-15 02:17 GMT

తూర్పు గోదావరి జిల్లా....

- బాణాసంచా పడి కాలినట్లుగా చెబుతున్నా స్థానికులు..

- సుమారు 5వందల కోళ్ళకు పైగా దగ్ధం, మంటలను అదుపుచేస్తూన్న ఫైర్ సిబ్బంది.

2020-11-15 02:11 GMT

  కృష్ణాజిల్లా, గన్నవరం

- టపాసు రవ్వలు పడి ఓ పూరిల్లుకు అంటుకొని చెలరేగిన మంటలు

- మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

2020-11-15 02:06 GMT

  తిరుమల సమాచారం

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 23,232 మంది భక్తులు.

- తలనీలాలు సమర్పించిన 8,400 భక్తులు.

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు.

Tags:    

Similar News