Live Updates: ఈరోజు (15 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (15 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 15 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య ఉ.11-24 తదుపరి శుక్లపక్ష పాడ్యమి | విశాఖ నక్షత్రం రా.7-11 తదుపరి | వర్జ్యం రా.10-56 నుంచి 12-25 వరకు | అమృత ఘడియలు రా.10-58 నుంచి 12-28 వరకు | దుర్ముహూర్తం సా.3-51 నుంచి 4-36 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.06-08 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha Updates: ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్న vmrda అధికారులు!
    15 Nov 2020 5:47 AM GMT

    Visakha Updates: ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్న vmrda అధికారులు!

      విశాఖ....

    - విశాఖ సిరిపురంలో vmrda స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్న, vmrda అధికారులు

    - భారీగా పోలీసులు మోహరింపు.

    - ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 2024 వరకు, లీజు ఉన్నప్పటికీ నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు అంటూ యజమాని హర్ష     ఆరోపణ.

    - లీజు అయిపోవడంతోనే ఖాళీ చేయిస్తున్నారు అంటున్న అధికారులు

  • Amaravati updates: రాజాగారి మరణం పార్టీకి తీరణి లోటు...
    15 Nov 2020 3:38 AM GMT

    Amaravati updates: రాజాగారి మరణం పార్టీకి తీరణి లోటు...

    అమరావతి

     టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్క్రోలింగ్ పాయింట్స్:

    • తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

    • తణుకు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరనీయం.

    • రాజాగారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.

    • ఎల్లవేళలా ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.

    • రాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

  • Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
    15 Nov 2020 3:07 AM GMT

    Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..

     విజయవాడ...

    - విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి చర్యలు చేపట్టండి.

    - గత నెల 19 నుండి విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఆందోళన చేపట్టారు.

    - యాజమాన్యం, జెఏసిల మధ్య అక్టోబరు 28న జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

    - దీంతో విద్యుత్ ఉద్యోగులు పోరాటానికి సమాయత్తమవుతున్నారు.

    - 2003 విద్యుత్ చట్టానికి 2020 పేరుతో సవరణలు చేయటం తగదు.

    - జెన్కో ఆధ్వర్యంలోని ఆర్టీపీపీలో, ఎన్ టి పి ఎస్ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభించాలి.

    - కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.

  • Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
    15 Nov 2020 3:01 AM GMT

    Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...

       నెల్లూరు:

    -- ఇన్ ఫ్లో 7657 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3770 క్యూసెక్కులు.

    -- ప్రస్తుత నీటి మట్టం 75.942 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.

  • Vizianagaram Updates: గిరిపుత్రులకు తప్పని డోలీ కష్టాలు..
    15 Nov 2020 2:19 AM GMT

    Vizianagaram Updates: గిరిపుత్రులకు తప్పని డోలీ కష్టాలు..

      విజయనగరం...

    - అర్దరాత్రి గర్బిణి మహిళకు పురిటినొప్పులు రావడంతో టార్చిలైట్లతో డోలీలో 10 కిలోమీటర్ల కొండదించిన వైనం.

    - దబ్బగుంట వరకు డోలీలో మోసుకుంటూ వచ్చి అక్కడ నుండి ఆటోలో శృంగవరపుకోట హస్పటలకు తరలింపు.

    - రహదారి సౌకర్యం లేక అను నిత్యం గిరిజనులకు వైద్యం కోసం తప్పని డోలీ మోతలు.

  • East Godavari Updates: పిఠాపురం మండలం లక్మినరసాపురంలో కోళ్ల ఫారం దగ్ధం..
    15 Nov 2020 2:17 AM GMT

    East Godavari Updates: పిఠాపురం మండలం లక్మినరసాపురంలో కోళ్ల ఫారం దగ్ధం..

    తూర్పు గోదావరి జిల్లా....

    - బాణాసంచా పడి కాలినట్లుగా చెబుతున్నా స్థానికులు..

    - సుమారు 5వందల కోళ్ళకు పైగా దగ్ధం, మంటలను అదుపుచేస్తూన్న ఫైర్ సిబ్బంది.

  • Krishna District Updates: గౌడపేటలో అగ్నిప్రమాదం...
    15 Nov 2020 2:11 AM GMT

    Krishna District Updates: గౌడపేటలో అగ్నిప్రమాదం...

      కృష్ణాజిల్లా, గన్నవరం

    - టపాసు రవ్వలు పడి ఓ పూరిల్లుకు అంటుకొని చెలరేగిన మంటలు

    - మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
    15 Nov 2020 2:06 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

      తిరుమల సమాచారం

    - నిన్న శ్రీవారిని దర్శించుకున్న 23,232 మంది భక్తులు.

    - తలనీలాలు సమర్పించిన 8,400 భక్తులు.

    - నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు.

Print Article
Next Story
More Stories