Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-11 00:37 GMT
Live Updates - Page 2
2020-09-11 09:45 GMT

Guntur updates: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది..ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు..

గుంటూరు....

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు..

-రాజ్యాంగ న్ని పక్కనపెట్టి...రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది

-కొడాలి నాని చంద్రబాబు, దేవినేని ఉమా గురించి అసభ్యకరంగా మాట్లాడటం దారుణం..

-కొడాలి నాని మానవత్వం మరచి మాట్లాడుతున్నారు...

-గుడివాడ లో టీడీపీ నాయకులపై గుండాలని పెట్టి దాడి చేయించారు...

-ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు..

-మీ ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేయటం తగదు..

-న్యాయస్థానాలు, రాజ్యాంగం ఉంది మీ అరాచకాలు సాగవు.

2020-09-11 09:42 GMT

Guntur updates: కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు...మాజీమంత్రి దేవినేని ఉమా..

గుంటూరు....

-మాజీమంత్రి దేవినేని ఉమా..

-ఈనెల 4న వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ విలేకరుల   సమావేశం ఏర్పాటు చేసి నాపై బెదిరింపులకు పాల్పడ్డారు...

-ఒక బాధ్యత గల మంత్రి అయిఉండి అసభ్యకరంగా మాట్లాతున్నారు..

-లారీతో గుద్ది యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారు...

-ఈ కుట్రలో సీఎం జగన్ కు భాగం ఉంది...

-అమరావతి రైతులు, దళితులని,న్యాయ విభాగంలో ఉన్నవారిని తిడితే కేసులు ఉండవా...రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది...

-శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైసిపి నాయకులకు వత్తాసు పలుకుతున్నారు...

-గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద పడి దాడిచేసై ఇప్పటివరకు చర్యలు లేవు...

-కృష్ణా జలాలు పులివెందులకు ఇచ్చినందుకే మాపై సీఎం జగన్ కు కోపం...

-రాష్ట్ర ప్రజలు అందరు వైసిపి అరాచకాలు గమనిస్తున్నారు...త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు...

2020-09-11 09:28 GMT

Vijayawada updates: గుడివాడలో దింట్యాల రాంబాబు ఇంటి పై దాడిని ఖండించిన కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘనాయకులు..

కృష్ణాజిల్లా..

-గుడివాడలో టిడిపి మాజీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఇంటి పై దాడి నీ ఖండించిన కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘనాయకులు.

-కొడాలి నాని రాజదాని విషయంలో అసత్యాలు మాట్లాడుతుంటే, ఖండించిన బ్రాహ్మణ సంఘ నేతపై కొడాలి నాని అనుచరులు దాడి చేయడం హైయమైన చర్య -   బ్రాహ్మణ సంఘ నాయకులు

-తక్షణమే మంత్రి కొడాలి నానీ క్షమాపణ చెప్పాలి - కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘ నాయకులు.

2020-09-11 09:24 GMT

Vijayawada updates: ఆసరా పధకాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్..

విజయవాడ...

దేవినేని అవినాష్ కామెంట్స్....

-వైస్సార్ ఆసరా వారోత్సవాలు లో భాగంగా తూర్పు నియోజకవర్గంలో ఆసరా పధకాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్

-మహిళలు తో కలసి సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం

-వైస్సార్ ఆసరా ద్వారా అందిన నగదుతో ఏర్పాటు చేసిన షాప్ ని ప్రారంభించిన అవినాష్

-సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వైస్సార్ ఆసరా ప్రారంభించారు

-మహిళ సాధికారిత కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తుంది

-మహిళలు ఆర్ధికంగా ఎదగటానికి జగన్ ఎంతో కృషి చేస్తున్నారు

-సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది

-గత ప్రభుత్వం ఓట్ల కోసం రాజకీయాలు చేస్తే,, జగన్ మాత్రం ప్రజలు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందుకు పని చేస్తున్నారు

-దేశంలోనే అందరికీ జగన్ రోల్ మోడల్ గా నిలుస్తున్నారు

-వైస్సార్ ఆసరా ద్వారా మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసన్నీ జగన్ నింపారు

-మహిళలు ఇచ్చే ఆశీర్వాదం తో జగన్ మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉంటారు.

2020-09-11 09:13 GMT

Mekatoti Sucharita-Home minister: శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్ లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు..

ప్రకాశం:

-మేకతోటి సుచరిత - హోమ్ శాఖ మంత్రి...

-ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతం సవాంగ్, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ లు పాల్గొన్నారు.

-19 వ బ్యాచ్ కు చెందిన 398 మంది మహిళా పోలీసులు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

-అమరులైన పోలీసులకు 50 లక్షల బీమా కల్పించడం జరిగింది.

-దేశం లోనే తొలి సారిగా వీక్లీ ఆఫ్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాదే.

-ఆంధ్రప్రదేశ్ లో జీరో ఎఫ్ ఐ ఆర్ విజయవంతంగా అమలవుతోంది.

-ఇప్పటివరకు రాష్ట్రంలో 320 జీరో FIR కేసులు నమోదు చేయడం జరిగింది.

-మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మహిళా మిత్ర ను ఏర్పాటు చేసాము.

-ఇంటర్నెట్ ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు సైబర్ మిత్ర ను ఏర్పాటు చేసాము.

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతర్వేది ఘటన పై సీరియస్ గా ఉన్నారు.

-సీబీఐ ఎంక్విరీ లో అన్ని విషయాలు బయటపడతాయి.

2020-09-11 08:56 GMT

East Godavari-Mamidikuduru: సాఫ్ట్ వేర్ భార్యకు వేధింపులు..కంటి డాక్టర్ అని చెప్పి మోసం..

తూ.గో.జిల్లా.....

మామిడికుదురు (మం)..

-ఇంటర్ చదివి కంటి డాక్టర్ అని చెప్పి మోసం చేసి సాఫ్ట్ వెర్ యువతిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు

-కంటి డాక్టర్ గా నమ్మ బలికి 2016 లో నగరం గ్రామానికి చెందిన కులుసుం ఉన్నిషా అనే వివాహితను పెళ్లాడిన ఆలీ హుస్సేన్

-పెళ్లి అయ్యినప్పటి నుండి భర్త , అత్తా మామల నుండి ఉన్నిష కు వేధింపులు

-నాలుగు సంవత్సరాలు నుండి 25 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసిన శాడిస్ట్ భర్త హాలీ ఉసేన్, అత్త ఫాతిమా గులబాజన్,     మామ  అలీ అబ్బాస్.

-ఆడపిల్ల పుట్టిందని నెపంతో మరింత వేధింపులకు గురి చేసిన భర్త ఆలీ హుస్సేన్

-కట్టుకున్న భార్యను నిత్యం వేధింపులకు గురిచేయడంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కులుసుం ఉన్నిషా

-ఇదే అదునుగా ఆగస్ట్ 6 న మరో మహిళతో హైదరాబాదులో వేరే పెళ్లి చేసుకున్న భర్త ఆలీ హుస్సేన్

-హింసించి ...మోసం చేసిన భర్త ను శిక్షించకపోతే చావే శరణ్యం అంటున్న బాధితురాలు

2020-09-11 08:50 GMT

Kurnool Updates: శ్రీశైలం మండలంలో చెంచు గిరిజనులకు కరోనా టెస్టుల నిర్వహణ..

కర్నూలు జిల్లా..

-ఇటీవల కాలంలో శ్రీశైలం మండలంలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో చెంచు గిరిజనులకు కరోనా టెస్టుల నిర్వహణ

-శ్రీశైలం గిరి పుత్రులకు కరోన టెస్టులను నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

-శ్రీశైలం లో మేకల బండ చెంచుగూడెం, పాలధార-పంచదార, హటకేశ్వరం, శిఖరేశ్వరం వద్ద నివసిస్తున్న చెంచు గిరిజనులకు కరోన టెస్టుల నిర్వహణ

2020-09-11 08:44 GMT

Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద..

కర్నూలు జిల్లా....

-7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

-ఇన్ ఫ్లో: 2,21,645 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో: 2,62,600 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు

-ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు

-పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు

-ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలు

-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-09-11 08:15 GMT

East Godavari updates: అమలాపురం Rdo కార్యాలయం వద్ద జనసేన, బిజెపి ఆందోళన..

తూర్పు గోదావరి జిల్లా..

అమలాపురం..

-అంతర్వేది సంఘటనలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్

-హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్

-ఆందోళనలో పాల్గొన్న బిజెపి నాయకులు మానేపల్లి అయ్యా జీవేమ, యాళ్ల దొరబాబు , జనసేన నాయకులు పితాని బాలకృష్ణ

-పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని Rdo కార్యాలయంలో అందజేసిన బిజెపి, జనసేన నాయకులు

2020-09-11 08:12 GMT

East Godavari updates: అంతర్వేది కేసు సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ..

తూర్పుగోదావరి..

-అంతర్వేది రథం దగ్ధం కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

-ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

-సీబీఐ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచిచూడాలి

Tags:    

Similar News