Live Updates: ఈరోజు (11 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11అక్టోబర్,2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-11 01:57 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 11 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి: మ.12.05 తదుపరి దశమి | పుష్యమి నక్షత్రం రా.8-59 తదుపరి ఆశ్లేష | వర్జ్యం: ఉ.శే.6-30 వరకు | అమృత ఘడియలు: మ.2-32 నుంచి 4-09 వరకు | దుర్ముహూర్తం: సా.4-05 నుంచి 4-52 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6.00 వరకు | సూర్యోదయం: ఉ.5-55 సూర్యాస్తమయం: సా.5-39

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-11 14:38 GMT

తిరుమల...

-వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో టీటీడీ విజిలెన్స్ వింగ్ ఆకస్మికంగా తనిఖీలు

-వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లును పరిశీలిస్తున్న టీటీడీ విజిలెన్స్ వింగ్ సిబ్బంది

-వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను అక్రమంగా విక్రయించిన వారిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ వింగ్ బృందం

-ఇద్దరు దళారులను విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు

2020-10-11 02:53 GMT

అనంతపురం:

-కనగానపల్లి మండలం మామిల్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

-50 కిలోల బ్యాగులు206 కర్ణాటక కు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.

-ఇద్దరు నిందితుల అరెస్టు, ఐచర్ వాహనం స్వాధీనం

2020-10-11 02:51 GMT

అనంతపురం:

-పెద్దపప్పురు మండలం ముచ్చుకోట లో ఉన్న భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటించడం లేదని నోటీసులు

-15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్న అధికారులు

2020-10-11 02:48 GMT

విజయవాడ..

-పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి దారుణ హత్య..

-తుపాకీతో కాల్ చంపిన దుండగులు..

-రియల్ ఎస్టేట్ వివాదంగా అనుమానo వ్యక్తం చేస్తున్న పోలీసులు..

-రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన ఘటన..

-పోలీసు కమిషనరేట్లో అటెండర్ గా పనిచేస్తు మృతుడు మహేష్..

-నున్న బైపాస్ రోడ్ లోని సుబ్బారెడ్డి బార్& రెస్టారెంట్ వద్ద ఘటన..

-స్కూటీపై వచ్చి కాల్పులు చేసిన గుర్తు తెలియని వ్యక్తి..

-మృతుడు మహేష్ గా ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీ..

-ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన సిపి..

-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న పోలీసులు

2020-10-11 02:44 GMT

తిరుమల సమాచారం...

-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 18,144 మంది భక్తులు

-తలనీలాలు సమర్పించిన 5,768 మంది భక్తులు

-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు

2020-10-11 02:19 GMT

విశాఖ..

-12 గంటల్లో వాయుగుండం గా, తర్వాత తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా.

-రేపు మధ్యాహ్నం కు ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

-ఉత్తరాంధ్ర లో బారీ వర్షాలు...

-తెలంగాణ కోస్తాంధ్రలకు భారీవర్షాలు. రాయలసీమకు చెదురుమదురుగా భారీ వర్షాలు.

-ఈనెల 14 న బంగాళాఖాతంలో అండమాన్ తీరాన మరో అల్పపీడనం

-14 వరకు మత్స్యకారులు చేపల వేట కు వెళ్ళరాదు.

-తీరం లో గంటకు 55- 65 కీ.మీ. వేగంతో గాలులు...

-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ.

Tags:    

Similar News