Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-08 01:49 GMT
Live Updates - Page 2
2020-08-08 13:43 GMT

సీసీ రోడ్డు వేస్తూండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి కూలీ మృతి.

వరంగల్ అర్బన్ జిల్లా: ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో సీసీ రోడ్డు వేస్తూండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి, చిల్పుర్ మండలం దేశాయి తండా గ్రామానికి చెందిన కూలీ భూక్య లోకేష్ (19) మృతి.

2020-08-08 12:20 GMT

- నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

2020-08-08 12:20 GMT

కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడారు: శ్రీనివాస్ గౌడ్

- సుప్రీం కోర్టు లో మేము వేసిన IA లో పోతిరెడ్డిపాడు , రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన తప్ప వేరే వున్నాయా... నేను చాలెంజ్ చేస్తున్నా..

- కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడారా..

- కోర్టు ప్రొసీజర్ తెలియక మాట్లాడారా..మీ అడ్వకేట్ లను అడిగి తెలుసుకోండి

- మేము కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చింది అప్పటి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచారని..

- మీరు కూడా సుప్రీం కోర్టు లో ఇంప్లీడ్ కండి.. మాకేమీ అభ్యంతరం లేదు

- ఏపి తో కొట్లాడేందుకు కలిసి వస్తం అంటే కలిసి రండి

- చీప్ గా మాట్లాడి చులకన కాకండి

- వాళ్ళు కాదు కూడదని ముందుకు వెళితే మా వ్యూహం మాకుంది.. క్రిష్ణా నది మొత్తం మహబూబ్ నగర్ జిల్లా మీది నుంచే పోతుంది లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే

- కాంగ్రెస్ నేతలకు మేము కోర్టు లో వేసిన IA అర్థం కాక మాట్లాడుతున్నారు.

- ఇప్పటికే slp వుంది కాబట్టి ఐఏ వేశాము

- ఏపికి వేసిన 203,388 GO లను అపందని మేము IA వేశాము

- రాయలసీమ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయితే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు.

2020-08-08 12:18 GMT

ఓటమి ఎరుగని నేత నంది ఎల్లయ్య: జగ్గారెడ్డి

- కాంగ్రెస్ పార్టీ ల్ 6 సార్లు ఎంపీ గా గెలిచిన వ్యక్తి వయసు రీత్యా,అనారోగ్య రీత్యా చనిపోవడం బాధాకరం..

- సోనియా,రాహుల్ గాంధీకి ,కాంగ్రెస్ పార్టీ కి లయాలిటీ గా ఉంటూ నాయకత్వం వచ్చిన నేత నంది ఎల్లయ్య ..

- ఒక దళిత మాదిగ నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం లో విజయవంతగా తన జీవితం గడపడం జరిగింది..

- ఓటమి ఎరుగని నేత నంది ఎల్లయ్య...

- నంది ఎల్లయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

2020-08-08 12:03 GMT

తెలంగాణ లో అన్ని రాజకీయపార్టీలను వణికిస్తున్న కరోన.

- తెలంగాణ లో అన్ని రాజకీయపార్టీలను వణికిస్తున్న కరోన.

- అధికార , ప్రతిపక్ష పార్టీలలో దడ పుట్టిస్తోంది.

- కరోనతో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి.

- తాజాగ అధికార టీఆరెస్ లో కార్మికశాఖ మంత్రి మల్ల రెడ్డి కి కరోన పొజిటీవ్.

- ఆయన మల్లారెడ్డి హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు.

- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి కరోన పొజిటీవ్. ఆయన కుటుంబంతో సహా కరోన పొజిటీవ్ రావడంతో ఆయన హోమ్ క్వరెంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

2020-08-08 12:00 GMT

రేషన్ బియ్యం లోడ్ తో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా.

కామారెడ్డి :

- భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులో గల కృష్ణమందిర్ సమీపంలో రేషన్ బియ్యం లోడ్ తో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా.

- ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు.

- భువనగిరి నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం.

- పోలీసుల సమాచారం మేరకు స్వాదీనపరుచుకుని ఎమ్ ఎల్ సి పాయింట్ కు తరలించిన సివిల్ సప్లై అధికారులు.

2020-08-08 11:32 GMT

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్

- రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్

- 2016 సెప్టెంబర్లో ఒకసారి మినహా ఇప్పటివరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలేదు

- విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డులపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉంది

- అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయింది

- 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో జలశక్తి శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో అనేక అపరిష్కృత అంశాలను గుర్తించారు

- వాటిని పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ 2019 సెప్టెంబర్లో ఎజెండా సిద్ధం చేయాలని రెండు రాష్ట్రాలను కోరింది

- మే 2020లో జలశక్తి శాఖ మరోసారి రాష్ట్రాలకు గుర్తుచేస్తూ లేఖలు రాసింది. అయినా స్పందన లేదు

- దాంతో గోదావరి, కృష్ణా బోర్డులు సూచించిన అంశాలతో జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ ఎజెండా సిద్ధం చేసింది

- 2020 మే 14న గోదావరి బోర్డుకు ఏపీ సర్కారు ఏడు తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ లేఖ రాసింది

- అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-3, సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, పెన్‌గంగాపై నిర్మించిన బ్యారేజులు రామప్ప - పాకాల సరస్సుల నీటి దారి మళ్లింపు ఉన్నాయి

- జూన్ 2018లో కాళేశ్వరం లిఫ్ట్ డీపీఆర్‌ను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే

- అయితే ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం రోజుకు 2 టీఎంసీ నుంచి 3టీఎంసీ వరకు లిఫ్ట్ సామర్థ్యం పెంచింది

- ప్రాజెక్టులో మార్పులు, సామర్థ్యం పెంపు వంటి వాటికి జలశక్తి శాఖ ఆమోదం ఉండాలి

- ఏపీ సర్కారు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవు

- అందుకే అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందే వరకు ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బోర్డ్ 2020 మే 30న లేఖ ద్వారా తెలియపర్చింది

- జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులపై లోతుగా చర్చ జరిగింది. వాటి డీపీఆర్‌లను జూన్ 10లోగా అందజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు సమర్పించలేదు.

- ఈ పరిస్థితుల్లో ఏపీ అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై డీపీఆర్‌లు సమర్పించకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందకుండా నిర్మాణం జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి జలశక్తి శాఖ చెబుతోంది.

- వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం జరపాలని కోరుకుంటున్నాను

- లేఖలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

2020-08-08 11:30 GMT

సికింద్రాబాద్ లో బోయిన్ పల్లి 300 గ్రాముల ఓపియం డ్రగ్ పట్టివేత

- సికింద్రాబాద్ లో బోయిన్ పల్లి 300 గ్రాముల ఓపియం డ్రగ్ పట్టివేత

- ఎవరికి అనుమానం రాకుండా చక్కెర తో కలిపి అమ్మకానికి సిద్ధం

- లాక్ డౌన్ లో వ్యాపారం లాస్ రావడం తో ఈ మార్గాన్ని ఎంచుకున్న హనుమాన్ రాం అనే 

2020-08-08 11:27 GMT

- మాజి ఎంపి నంది ఎల్లయ్య మరణం గురించి ఢిల్లీలోని టెన్ జనఫధ్ కు తెలియజేసిన మాజి ఎంపి హనుమంత రావు....

- వెంటనే స్పందించి న ఏఐసిసి కార్యాలయ వర్గాలు...

- నంది ఎల్లయ్య సోదరుడు నంది కృష్ణతో పోన్ లో మాట్లాడి నంది ఎల్లయ్య మరణం పట్ల సంతాపం ప్రకటించిన సానియా గాందీ...

- వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన సోనియా...

2020-08-08 11:26 GMT

చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒంటికన్ను తో జన్మించిన మగ శిశువు..

మంచిర్యాల జిల్లా:

- చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒంటికన్ను తో జన్మించిన మగ శిశువు.

- చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ ప్రియాంక దంపతులకు ఒకే కంటితో జన్మించిన పసికందు.

Tags:    

Similar News