Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-07 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-07 12:38 GMT

తిరుమ‌ల‌...

-తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల‌లోని అతిథి భ‌వ‌నాల‌ను కాటేజి డోనే‌ష‌న్ స్కీమ్‌ కింద టెండ‌ర్లు దాఖ‌లు చేసిన దాత‌ల‌కు కేటాయింపు ఖ‌రారు

-గ‌తంలో అతిథి భ‌వ‌నాలు నిర్మించిన దాత‌లకు నిర్థారించిన‌ కాల ప‌రిమితి ముగియ‌డంతో టెండ‌ర్లు ఆహ్వానించిన టీటీడీ

-శ్రీ‌ప‌తి విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.11 కోట్ల‌తో ( 7 కోట్ల 11 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన ఫోనిక్స్ ప‌వ‌ర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌,

-విద్యాస‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.89 కోట్ల‌తో ( 7 కోట్ల 89 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన జూప‌ల్లి శ్వామ్‌రావు,

-స్నేహ‌ల‌త విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.87 కోట్లతో ( 7 కోట్ల 87 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన పిచ‌మ్మై ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్,

-కార‌మ్ నివాస్  విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 6.8 కోట్ల‌తో ( 6 కోట్ల 80 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన భూదాతి ల‌క్ష్మీ నారాయ‌ణ,

-వ‌కుళా విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 6.5 కోట్ల‌తో ( 6 కోట్ల 50 ల‌క్ష‌లు) ముంబాయికి చెందిన రాజేష్ శ‌ర్మ .

-గంబెల్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ.5.99 కోట్ల‌తో ( 5 కోట్ల 99 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన శ్రీ‌మ‌తి ఎస్‌.భాగ్య‌శ్రీ  

-శ్రీ‌నికిత‌న్‌ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.98 కోట్ల‌తో ( 5 కోట్ల 98 ల‌క్ష‌లు 50 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన శ‌ర‌త్ చంద్ర రెడ్డి

-గోదావ‌రి విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.5 కోట్ల‌తో ( 5 కోట్ల 50 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్‌

-ల‌క్ష్మీ నిల‌యం విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.25 కోట్లతో ( 5 కోట్ల 25 ల‌క్ష‌లు) ముంబాయికి చెందిన అఫ్‌కాన్స్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్

-బాలాజి కుటిర్ వి‌శ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5 కోట్ల‌తో ( 5 కోట్ల 11 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన ఓం ప్ర‌కాష్ అగ‌ర్వాల్

-శాంతి స‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5 కోట్ల‌తో బెంగుళూరుకు చెందిన ఎమ్‌.ఎస్‌.ర‌క్ష‌రామ‌య్య‌, ఎమ్‌.ఎస్‌. సుంద‌ర్ రామ్‌‌

-టీటీడీ అధికారులు టెండ‌ర్లు ఖ‌‌‌‌రారు చేశారు

2020-10-07 12:33 GMT

జాతీయం..

డి కె అరుణా బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు...

-ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పతకం గురుంచి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమి మాట్లాడలేదు

-రాష్ట్ర ప్రజలు అందరూ ఈ విషయం గురుంచి ఎదురుచుసారు

-రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలను మరోసారి మోసము చేస్తున్నాడు

-దక్షిణ తెలంగాణ రైతులెనోట్లో మట్టి కొడుతున్నాడు

-కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు

-పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నిధులు లేవని చెవుతున్నావు ఎలా మళ్ళీ కొత్తది ప్రాజెక్టు కడుతావు

-పాలమూరు, రంగారెడ్డి ప్రజలపైన చిత్తశుద్ధి లేదు కేసీఆర్ కి

-రాయలసీమ ప్రాజెక్టు ముందస్తుగా మద్దతు ఇచ్చావు

-ఆంధ్రప్రదేశ్ అదనంగా 8 టి ఎమ్ సిల నీళ్లను తీసుకపోతున్నది

-ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఓ పంపలేదు

-దొంగలు దొంగలు కలిసినట్టు కాంట్రాక్టర్లతో జతకట్టి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు

-30000 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లపైగా వ్యయం పెంచాడు

-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డతో కేసీఆర్ కి లోపాయకారి ఒప్పందం ఉంది

-599 టి ఎమ్ సీల నీళ్ల వాటా మనకు రావాల్సి ఉంది... కానీ ప్రస్తుతం 299 టి ఎమ్ సిల నీళ్లు మాత్రమే వస్తున్నాయి

2020-10-07 12:22 GMT

విశాఖ..

-గీతం వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ కామెంట్స్...

-సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాం.

-123 కాలేజీలకు యూ జీ సీ ఇచిన యూనివర్సిటీ హోదా రద్దు చేయడం అవాస్తవం.

-గీతం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకొనే సమయం.

-ఇలాంటి సమయంలో ఈ యూనివర్సిటీ పై ద్రుష్పచారం చేయడం కరెక్ట్ కాదు.

2020-10-07 12:17 GMT

అమరావతి..

ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు..

-జగన్మోహన్ రెడ్డి ప్రధానితో ఏం చర్చించారని ప్రజలంతా అనుకుంటున్నారు.

-40 నిమిషాలపాటు వారిద్దరూ ఏం చర్చించారో, ముఖ్యమంత్రి బయటకు చెప్పకపోతే ఎలా?

-జగన్ తోకముడిచుకొని వెనక్కురావడం చూస్తుంటే, రాష్ట్రానికి నయాపైసా ప్రయోజనం జరిగే అంశాలేవీ, ఆయన ప్రధానితో చర్చించినట్టుగా లేడనిపిస్తోంది.

-ముఖ్యమంత్రి తనపై ఉన్న 31 కేసులు గురించే మోదీతో చర్చించారా?

-ముఖ్యమంత్రి పదవితో వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ, కేసులు మాఫీ చేయించుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారా...?

-రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేకహోదా గురించి, పునర్విభజన చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదు..?

-కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా తెస్తాడనే, యువత జగన్ కు ఓట్లేశారు.

-రాష్ట్రప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టేలా జగన్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి.

-అధికారం ఇచ్చింది ప్రతిపక్షంపై కక్షసాధించడానికో, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడానికో కాదనే నిజాన్ని జగన్ గ్రహించాలి.

-వైసీపీ ఎంపీలు హోదాసహా, ఇతర అంశాలపై కేంద్రంతో పోరాడటానికి ముందుకొస్తే, వారికి టీడీపీ ఎంపీలు ఎప్పుడూ అండగా ఉంటారు.

2020-10-07 12:10 GMT

తిరుమ‌ల‌..

-అక్టోబ‌రు 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

-నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 15 నుండి 24వ తేదీ వ‌ర‌కు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం

-ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

2020-10-07 12:06 GMT

అనంతపురం:

-కదిరి ( మ) చిప్పల మడుగు పోస్ట్ ఆఫీస్ లో ఇంచార్జ్ పోస్ట్ మాస్టర్ గంగాధర్ చేతివాటం,

-ఖాతాదారులు కట్టిన రూ. 5 లక్షల పైగా స్వాహా.

-కట్టిన డబ్బులు తమ అకౌంట్లో జమ చేయాలని పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన ఖాతాదారులు.

-పత్తాలేకుండా పోయిన ఉద్యోగి గంగాధర్..

2020-10-07 11:59 GMT

కృష్ణాజిల్లా..

-గుడివాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జూనియర్ అసిటెంట్ కు కరోనా పాజిటివ్

-ఆగని రిజిస్టేషన్లు భయందోళనలో ఆఫీస్ సిబ్బంది, కక్షి దారులు

-శానిటేషన్ కూడా చేయని రెవెన్యూ అధికారులు

2020-10-07 11:52 GMT

విజయవాడ..

-దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన పాలకమండలి సభ్యులు

-దసర ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ బాబు

-సోమినాయుడు దుర్గగుడి ఛైర్మన్, ఈవో సురేశ్ బాబు

-37 అంశాలు సమావేశంలో చర్చించాం

-17 నుండి 25 వరకు దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించాం

-ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తాం

-ఆరడుగులు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం

-మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

-మూల నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కలెక్టర్ అనుమతితో ఆన్ లైన్ టిక్కెట్లు పెంచే ఆలోచన చేస్తాం

-ఈ సారి దసర ఉత్సవాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం

2020-10-07 08:38 GMT

తూర్పుగోదావరి -రాజమండ్రి - పెద్దాపురం

- తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ కామెంట్స్

- కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఫైర్

- ఇఎస్ ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరామ్ ఇప్పడు మరో భూ కుంభకోణానికి తెరలేపారు.

- ఇట్టినా కంపెనీ లావాదేవీలతో సంబంధం లేని మంజునాధ్ ను అడ్డం పెట్టుకుని మంత్రి జయరాం ఆ కంపెనీ భూములను తన కుటుంబ సభ్యుల పేర అక్రమంగా బదలాయించుకున్నారు.

- తమకు భూములు విక్రయించేందుకు ఇట్టినా కంపెనీ యాజమాన్యం అంగీకరించినట్టు కంపెనీ బోర్డు తీర్మానాలు సృష్టించారు.

- ల్యాండ్ సీలింగ్ నిబంధనలతో బినామీల పేరుతో 115 ఎకరాలు భూమిని, కుటుంబ సభ్యుల పేరున 92 ఎకరాల భూమిని మొత్తం 203 ఎకరాలను ఈఏడాది మార్చి2న ఇట్టినా కంపెనీ నుండి తమ వాళ్ల పేర్ల మీద రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు.

- ఇట్టినా కంపెనీకి చెందిన భూమిని అక్రమంగా, దౌర్జన్యంగా మంత్రి కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు

- బదలాయించుకున్న అక్రమభూములపై వ్యవసాయ రూణాలను తీసుకునేందుకు కర్నూలు జిల్లా కో-అపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ధరఖాస్తుకున్నారు

- ఈ భూములు కొనుగోలు వ్యవహారంలో మాంత్రి జయరాం ప్రమేయం తదితర అంశాలపై సిబిఐ విచారణ జరిపించాలి


2020-10-07 08:31 GMT

గుంటూరు: కృష్ణ,గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ స్వాతంత్ర్య ఎమ్మెల్సీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను - ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ .

- 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్దెనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచాను.

- ఆ సమయంలో అందరూ మద్దతు తెలిపారు.... స్వతంత్ర 

- ఏఆశయాలతో అప్పటి ఉపాధ్యాయులు ఎన్నుకున్నారో వాటి సాధన కోసం కృషి చేశా.

- మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని కోరుతున్న నేపధ్యంలో మళ్ళీ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను....

- పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం పని చేశా...

- కృష్ణ,గుంటూరు ఉపాధ్యాయులు మళ్ళీ గెలిపిస్తే గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా.

- అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.....

Tags:    

Similar News