Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Tirumala updates: అతిథి భ‌వ‌నాలను టెండ‌రు ప్రాతిప‌దిక‌న‌ దాతలకు కేటాయించిన టీటీడీ...
    7 Oct 2020 12:38 PM GMT

    Tirumala updates: అతిథి భ‌వ‌నాలను టెండ‌రు ప్రాతిప‌దిక‌న‌ దాతలకు కేటాయించిన టీటీడీ...

    తిరుమ‌ల‌...

    -తిరుమ‌ల‌లో వివిధ ప్రాంతాల‌లోని అతిథి భ‌వ‌నాల‌ను కాటేజి డోనే‌ష‌న్ స్కీమ్‌ కింద టెండ‌ర్లు దాఖ‌లు చేసిన దాత‌ల‌కు కేటాయింపు ఖ‌రారు

    -గ‌తంలో అతిథి భ‌వ‌నాలు నిర్మించిన దాత‌లకు నిర్థారించిన‌ కాల ప‌రిమితి ముగియ‌డంతో టెండ‌ర్లు ఆహ్వానించిన టీటీడీ

    -శ్రీ‌ప‌తి విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.11 కోట్ల‌తో ( 7 కోట్ల 11 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన ఫోనిక్స్ ప‌వ‌ర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌,

    -విద్యాస‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.89 కోట్ల‌తో ( 7 కోట్ల 89 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన జూప‌ల్లి శ్వామ్‌రావు,

    -స్నేహ‌ల‌త విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 7.87 కోట్లతో ( 7 కోట్ల 87 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన పిచ‌మ్మై ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్,

    -కార‌మ్ నివాస్  విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 6.8 కోట్ల‌తో ( 6 కోట్ల 80 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన భూదాతి ల‌క్ష్మీ నారాయ‌ణ,

    -వ‌కుళా విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 6.5 కోట్ల‌తో ( 6 కోట్ల 50 ల‌క్ష‌లు) ముంబాయికి చెందిన రాజేష్ శ‌ర్మ .

    -గంబెల్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ.5.99 కోట్ల‌తో ( 5 కోట్ల 99 ల‌క్ష‌లు) చెన్నైకి చెందిన శ్రీ‌మ‌తి ఎస్‌.భాగ్య‌శ్రీ  

    -శ్రీ‌నికిత‌న్‌ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.98 కోట్ల‌తో ( 5 కోట్ల 98 ల‌క్ష‌లు 50 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన శ‌ర‌త్ చంద్ర రెడ్డి

    -గోదావ‌రి విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.5 కోట్ల‌తో ( 5 కోట్ల 50 ల‌క్ష‌లు) హైద‌రాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్‌

    -ల‌క్ష్మీ నిల‌యం విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5.25 కోట్లతో ( 5 కోట్ల 25 ల‌క్ష‌లు) ముంబాయికి చెందిన అఫ్‌కాన్స్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్

    -బాలాజి కుటిర్ వి‌శ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5 కోట్ల‌తో ( 5 కోట్ల 11 వేలు) హైద‌రాబాద్‌కు చెందిన ఓం ప్ర‌కాష్ అగ‌ర్వాల్

    -శాంతి స‌ద‌న్ విశ్రాంతి భ‌వ‌న‌మున‌కు రూ. 5 కోట్ల‌తో బెంగుళూరుకు చెందిన ఎమ్‌.ఎస్‌.ర‌క్ష‌రామ‌య్య‌, ఎమ్‌.ఎస్‌. సుంద‌ర్ రామ్‌‌

    -టీటీడీ అధికారులు టెండ‌ర్లు ఖ‌‌‌‌రారు చేశారు

  • D. K. Aruna: కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమి మాట్లాడలేదు...
    7 Oct 2020 12:33 PM GMT

    D. K. Aruna: కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమి మాట్లాడలేదు...

    జాతీయం..

    డి కె అరుణా బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు...

    -ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పతకం గురుంచి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏమి మాట్లాడలేదు

    -రాష్ట్ర ప్రజలు అందరూ ఈ విషయం గురుంచి ఎదురుచుసారు

    -రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలను మరోసారి మోసము చేస్తున్నాడు

    -దక్షిణ తెలంగాణ రైతులెనోట్లో మట్టి కొడుతున్నాడు

    -కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు

    -పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నిధులు లేవని చెవుతున్నావు ఎలా మళ్ళీ కొత్తది ప్రాజెక్టు కడుతావు

    -పాలమూరు, రంగారెడ్డి ప్రజలపైన చిత్తశుద్ధి లేదు కేసీఆర్ కి

    -రాయలసీమ ప్రాజెక్టు ముందస్తుగా మద్దతు ఇచ్చావు

    -ఆంధ్రప్రదేశ్ అదనంగా 8 టి ఎమ్ సిల నీళ్లను తీసుకపోతున్నది

    -ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఓ పంపలేదు

    -దొంగలు దొంగలు కలిసినట్టు కాంట్రాక్టర్లతో జతకట్టి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు

    -30000 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లపైగా వ్యయం పెంచాడు

    -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డతో కేసీఆర్ కి లోపాయకారి ఒప్పందం ఉంది

    -599 టి ఎమ్ సీల నీళ్ల వాటా మనకు రావాల్సి ఉంది... కానీ ప్రస్తుతం 299 టి ఎమ్ సిల నీళ్లు మాత్రమే వస్తున్నాయి

  • Visakha updates: గీతం డ్డీమ్డ్ విశ్వవిద్యాలయం పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు...
    7 Oct 2020 12:22 PM GMT

    Visakha updates: గీతం డ్డీమ్డ్ విశ్వవిద్యాలయం పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు...

    విశాఖ..

    -గీతం వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ కామెంట్స్...

    -సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాం.

    -123 కాలేజీలకు యూ జీ సీ ఇచిన యూనివర్సిటీ హోదా రద్దు చేయడం అవాస్తవం.

    -గీతం విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకొనే సమయం.

    -ఇలాంటి సమయంలో ఈ యూనివర్సిటీ పై ద్రుష్పచారం చేయడం కరెక్ట్ కాదు.

  • Amaravati updates: ప్రధానితో ఏం చర్చించారో, ప్రజలకు చెప్పకపోతే ఎలా?...
    7 Oct 2020 12:17 PM GMT

    Amaravati updates: ప్రధానితో ఏం చర్చించారో, ప్రజలకు చెప్పకపోతే ఎలా?...

    అమరావతి..

    ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు..

    -జగన్మోహన్ రెడ్డి ప్రధానితో ఏం చర్చించారని ప్రజలంతా అనుకుంటున్నారు.

    -40 నిమిషాలపాటు వారిద్దరూ ఏం చర్చించారో, ముఖ్యమంత్రి బయటకు చెప్పకపోతే ఎలా?

    -జగన్ తోకముడిచుకొని వెనక్కురావడం చూస్తుంటే, రాష్ట్రానికి నయాపైసా ప్రయోజనం జరిగే అంశాలేవీ, ఆయన ప్రధానితో చర్చించినట్టుగా లేడనిపిస్తోంది.

    -ముఖ్యమంత్రి తనపై ఉన్న 31 కేసులు గురించే మోదీతో చర్చించారా?

    -ముఖ్యమంత్రి పదవితో వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ, కేసులు మాఫీ చేయించుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారా...?

    -రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేకహోదా గురించి, పునర్విభజన చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన వాటి గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదు..?

    -కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా తెస్తాడనే, యువత జగన్ కు ఓట్లేశారు.

    -రాష్ట్రప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టేలా జగన్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి.

    -అధికారం ఇచ్చింది ప్రతిపక్షంపై కక్షసాధించడానికో, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడానికో కాదనే నిజాన్ని జగన్ గ్రహించాలి.

    -వైసీపీ ఎంపీలు హోదాసహా, ఇతర అంశాలపై కేంద్రంతో పోరాడటానికి ముందుకొస్తే, వారికి టీడీపీ ఎంపీలు ఎప్పుడూ అండగా ఉంటారు.

  • Tirumala updates: ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..
    7 Oct 2020 12:10 PM GMT

    Tirumala updates: ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..

    తిరుమ‌ల‌..

    -అక్టోబ‌రు 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

    -నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 15 నుండి 24వ తేదీ వ‌ర‌కు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం

    -ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

  • Anantapur district updates: కదిరి ( మ) పోస్ట్ ఆఫీస్ లో ఇంచార్జ్ పోస్ట్ మాస్టర్ గంగాధర్ చేతివాటం...
    7 Oct 2020 12:06 PM GMT

    Anantapur district updates: కదిరి ( మ) పోస్ట్ ఆఫీస్ లో ఇంచార్జ్ పోస్ట్ మాస్టర్ గంగాధర్ చేతివాటం...

    అనంతపురం:

    -కదిరి ( మ) చిప్పల మడుగు పోస్ట్ ఆఫీస్ లో ఇంచార్జ్ పోస్ట్ మాస్టర్ గంగాధర్ చేతివాటం,

    -ఖాతాదారులు కట్టిన రూ. 5 లక్షల పైగా స్వాహా.

    -కట్టిన డబ్బులు తమ అకౌంట్లో జమ చేయాలని పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన ఖాతాదారులు.

    -పత్తాలేకుండా పోయిన ఉద్యోగి గంగాధర్..

  • Krishna district updates: జూనియర్ అసిటెంట్ కు కరోనా పాజిటివ్..
    7 Oct 2020 11:59 AM GMT

    Krishna district updates: జూనియర్ అసిటెంట్ కు కరోనా పాజిటివ్..

    కృష్ణాజిల్లా..

    -గుడివాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జూనియర్ అసిటెంట్ కు కరోనా పాజిటివ్

    -ఆగని రిజిస్టేషన్లు భయందోళనలో ఆఫీస్ సిబ్బంది, కక్షి దారులు

    -శానిటేషన్ కూడా చేయని రెవెన్యూ అధికారులు

  • Vijayawada Durgamma updates: ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం..
    7 Oct 2020 11:52 AM GMT

    Vijayawada Durgamma updates: ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం..

    విజయవాడ..

    -దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన పాలకమండలి సభ్యులు

    -దసర ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ బాబు

    -సోమినాయుడు దుర్గగుడి ఛైర్మన్, ఈవో సురేశ్ బాబు

    -37 అంశాలు సమావేశంలో చర్చించాం

    -17 నుండి 25 వరకు దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించాం

    -ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తాం

    -ఆరడుగులు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం

    -మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

    -మూల నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కలెక్టర్ అనుమతితో ఆన్ లైన్ టిక్కెట్లు పెంచే ఆలోచన చేస్తాం

    -ఈ సారి దసర ఉత్సవాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం

  • కార్మిక శాఖ మంత్రి పై తెదేపా చినరాజప్ప ఫైర్
    7 Oct 2020 8:38 AM GMT

    కార్మిక శాఖ మంత్రి పై తెదేపా చినరాజప్ప ఫైర్

    తూర్పుగోదావరి -రాజమండ్రి - పెద్దాపురం

    - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ కామెంట్స్

    - కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఫైర్

    - ఇఎస్ ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జయరామ్ ఇప్పడు మరో భూ కుంభకోణానికి తెరలేపారు.

    - ఇట్టినా కంపెనీ లావాదేవీలతో సంబంధం లేని మంజునాధ్ ను అడ్డం పెట్టుకుని మంత్రి జయరాం ఆ కంపెనీ భూములను తన కుటుంబ సభ్యుల పేర అక్రమంగా బదలాయించుకున్నారు.

    - తమకు భూములు విక్రయించేందుకు ఇట్టినా కంపెనీ యాజమాన్యం అంగీకరించినట్టు కంపెనీ బోర్డు తీర్మానాలు సృష్టించారు.

    - ల్యాండ్ సీలింగ్ నిబంధనలతో బినామీల పేరుతో 115 ఎకరాలు భూమిని, కుటుంబ సభ్యుల పేరున 92 ఎకరాల భూమిని మొత్తం 203 ఎకరాలను ఈఏడాది మార్చి2న ఇట్టినా కంపెనీ నుండి తమ వాళ్ల పేర్ల మీద రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు.

    - ఇట్టినా కంపెనీకి చెందిన భూమిని అక్రమంగా, దౌర్జన్యంగా మంత్రి కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు

    - బదలాయించుకున్న అక్రమభూములపై వ్యవసాయ రూణాలను తీసుకునేందుకు కర్నూలు జిల్లా కో-అపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ధరఖాస్తుకున్నారు

    - ఈ భూములు కొనుగోలు వ్యవహారంలో మాంత్రి జయరాం ప్రమేయం తదితర అంశాలపై సిబిఐ విచారణ జరిపించాలి


  • 7 Oct 2020 8:31 AM GMT

    స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఎఎస్ రామకృష్ణ .

    గుంటూరు: కృష్ణ,గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ స్వాతంత్ర్య ఎమ్మెల్సీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను - ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ .

    - 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్దెనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచాను.

    - ఆ సమయంలో అందరూ మద్దతు తెలిపారు.... స్వతంత్ర 

    - ఏఆశయాలతో అప్పటి ఉపాధ్యాయులు ఎన్నుకున్నారో వాటి సాధన కోసం కృషి చేశా.

    - మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని కోరుతున్న నేపధ్యంలో మళ్ళీ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను....

    - పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం పని చేశా...

    - కృష్ణ,గుంటూరు ఉపాధ్యాయులు మళ్ళీ గెలిపిస్తే గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా.

    - అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.....

Print Article
Next Story
More Stories