Live Updates: ఈరోజు (01 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-01 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-01 15:30 GMT

చిత్తూరు..

అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి..

-శ్రీ కాళహస్తి ఆలయంలో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

-ఆలయ గార్డ్ డ్యూటీ విధులు నిర్వహిస్తుకే.సుబ్రమణ్యం ఏ.ఆర్ హెచ్.సి 1234 అజాగ్రత్త వళ్ళ ఆయుధం మిస్ ఫైర్ అయినట్లు నిర్దారణ

-ఘటనకు భాధ్యునిగా చేస్తూ సస్పెన్షన్

-విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

2020-10-01 15:24 GMT

అమరావతి..

-క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్జున అవార్డీ 

-తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ సాత్విక్ ను అభినందించి

-మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి పినిపె విశ్వరూప్

2020-10-01 15:21 GMT

విశాఖ..

-ఉత్తర ప్రదేశ్ లో దళితయువతి దారుణంపై ఆర్కే బీచ్ రోడ్డులో ఆగ్రహజ్వాలలు.

-ప్రధాని మోడీ దిష్డిబొమ్మను దగ్దం చేసిన కాంగ్రెస్ శ్రేణులు..అడ్డుకున్న పోలీసులు

-నిరసన లో పాల్గొన్న పిసిసి చీఫ్ శైలజానాధ్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.

2020-10-01 13:46 GMT

తిరుమల..

-ప‌రిమితంగా సంఖ్యలో భక్తులకు అనుమతించి వాహ‌న‌సేవ‌లు

-ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష‌

-గ‌రుడ సేవ‌తో పాటు అన్ని వాహ‌న‌సేవ‌ల‌కు ద‌ర్శ‌న టికెట్లు ఉన్న భ‌క్తుల‌ను మాత్ర‌మే గ్యాల‌రీల్లోకి అనుమ‌తి

-ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌రకు వాహ‌న‌సేవ‌లు ఉంటాయి.

-బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆరో రోజైన అక్టోబ‌రు 21న సాయంత్రం పుష్ప‌క విమాన‌సేవ‌, అక్టోబ‌రు 23న స్వ‌ర్ణర‌థం ఊరేగింపు కూడా ఉంటాయి.

-గ్యాల‌రీల్లో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌తోపాటు ఫుట్ ఆప‌రేటెడ్ శానిటైజ‌ర్లు ఏర్పాటు.

-భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు ఏర్పాట్లు.

-త‌గిన‌న్ని ల‌డ్డూలు త‌యారీ సిద్దమౌతున్న టిటిడి

-క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌, ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటు.

2020-10-01 12:42 GMT

అమరావతి..

-సిపిఐ నారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

-బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి కుట్రచేశారనడం సరి కాదు

-ఉమాభారతి ముందుండి నడిపించారని, ఆమె ఆ నృత్యాలు చేశారని నారాయణ మాట్లాడటం సమంజసం కాదు

-దేశంలో మొదటి నుంచీ హిందువులకు వ్యతిరేకంగా, ఇతర మతాలపై బుజ్జగింపు రాజకీయాలు చేసే కమ్యూనిస్టులకు ఈ తీర్పు రుచించదు

-అందుకే పేపర్లలో నారాయణ రంకెలేస్తూ, నృత్యాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు

-అద్వానీ, జోషి, ఇతర నాయకులు ఆ వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేయమని ఆదేశించడం మీరు చూశారా?

-సీబీఐ ఈ కేసులో నిస్పక్షపాతంగా తీర్పు ఇచ్చింది

-బీజేపీ సీనియర్ నాయకులపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పుడు అభియోగాలు శుద్ధ అబద్దాలుగా ఈ తీర్పు ద్వారా వెల్లడైంది

-పవన్ కల్యాణ్, బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించే హక్కు మీకు లేదు.

-కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోలేని పార్టీ దేశంలో ఏదైనా ఉందా? మీరు చెప్పాలి.

-కాంగ్రెస్, ఎన్టీఆర్, చంద్రబాబులతో మీరు పొత్తు పెట్టుకోలేదా?

-మీకు జ్ఞాపకశక్తి లేదా లేక చరిత్రపై అవగాహన లేదా?

-పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని, నిబద్దతను ప్రశ్నించే ముందు మీరు గతంలో ఆయనతో పొత్తు పెట్టుకున్నప్పుడు అతని వ్యక్తిగత విషయాల గురించి తెలియలేదా?ఆరోజు మీ మతిభ్రమించిందా?

-2014లో పవన్ కల్యాణ్ బీజేపీ, తెలుగుదేశంతో కలసి పొత్తు పెట్టుకుని విజయం సాధించాం.

-తక్షణం బాబ్రీ మసీదు కేసుపై మీ వ్యతిరేకతను, పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులను వ్యతిరేకిస్తూ చేసిన మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

2020-10-01 12:31 GMT

విజయవాడ..

* విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయంలో సమావేశమైన మంత్రులు మేకపాటి, బొత్స, కన్నబాబు

* చక్కెర ఫ్యాక్టరీలు త్వరలో మొదలు పెట్టాలి

*భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలో పరికరాలు చాలా కాలం నాటివి

* చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో సామర్థ్యానికి తగ్గట్లు పని చేయడం లేదు

* జిల్లాలవారీగా చెరకు పంట, ఉత్పత్తి వివరాలు సేకరించాలి : మంత్రి మేకపాటి, కన్నబాబు, బొత్స సత్యనారాయణ

* మరమ్మతులు చేసి, అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి.

* ఏటికొప్పాక ఫ్యాక్టరీపై ఆధారపడిన 4500 మంది చెరకు రైతుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం.

* సమావేశంలో పాల్గొన్న, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్         వెంకటరావు,తదితరులు

2020-10-01 12:28 GMT

అమరావతి..

-ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

-గాంధీ జయంతి నాడు అనేకమంది రాజకీయ నాయకులు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడుతారు

-కానీ సీఎం జగన్ ఆచరించి చూపించారు

-రేపటికి గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టీ ఏడాది పూర్తి అవుతుంది

-ఒకటో తారీకున తెల్లవారక ముందే ఇంటికి వెళ్లి అవ్వ తాతలకు పెన్షన్ అందిస్తున్నాం

-ప్రధాన మంత్రి స్వయంగా సచివాలయ వ్యవస్థను అభినందించారు

-పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నాం... గతంతో పోలిస్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు

-లోకేష్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉండి సాధించింది ఎంటి

-చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ది చేశాం అని చెప్పుకుంటారు

-హైదరాబాద్ ను ఆ సమయంలో ఎవరున్నా అభివృద్ది చేసేవారు

-చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టారా? జగన్ 16 కాలేజీలు కడుతున్నారు

-చంద్రబాబు పై స్టే వెకెట్ చేస్తే అవినీతి బయటపడుతుంది

2020-10-01 12:21 GMT

అమరావతి..

-పెన్షన్ విషయంలో జగన్ రెడ్డి గారి మోసాలు అన్నీ ఇన్నీ కావు.

-అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ అన్నారు.

-మాట మార్చి,మడమ తిప్పి ప్రతి ఏడాది పెన్షన్ రూ.250 పెంచుతూ పోతాన‌న్నారు.

-జూలై నుండి రూ.2500 పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు.

-ఇప్పటికే అవ్వా, తాతలు రూ.1000 నష్టపోయారు.

-సంక్షేమ క్యాలెండర్ లో అవ్వా, తాతల పెన్షన్ పెంపు ప్రస్తావన లేకపోవడం దారుణం. టిడిపి ఐదేళ్లలో రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలకు పెంచింది.

-వైసీపీ నేతలు వెయ్యి పెన్షన్ ని రూ.2250 చేసామంటూ సిగ్గు వదిలి అసత్య ప్రచారం చేస్తున్నారు.

-తేదీ.30.5.2019 న జగన్ రెడ్డి గారి మొదటి సంతకం ప్రకారం జారీ చేసిన జిఓ.103 లో 2 వేల పెన్షన్ ని రూ.2250 కి పెంచుతున్నట్టు ఎందుకు ఉందో     సమాధానం చెప్పాలి

-ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ని పెంచి జూలై నుండి ఉన్న బకాయిలు పెన్ష‌న‌ర్ల‌కు చెల్లించాలి.

2020-10-01 12:17 GMT

అమరావతి..

-అమరావతి రాజధాని అంశంపై హైకోర్ట్ లో సిపీఐ తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.

-1953లో మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విడివడినప్పుడు కూడా విజయవాడలో రాజధాని పెట్టాలని సిపీఐ కోరింది.

-రాష్ట్ర విభజనానంతరం విజయవాడ-గుంటూరు మధ్య ఏపీ రాజధాని ఉండాలని సిపీఐ 2014 జూన్ లోనే ప్రకటించింది.

-అమరావతి రాజధానిగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు అనువైన ప్రదేశం.

-ప్రాంతాలమద్య వైషమ్యాలు తగదు.

-ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్దికి తగు చర్యలు చేపట్టాలి - రామకృష్ణ

2020-10-01 12:13 GMT

విజయవాడ..

-జూన్ 26 న రెండు వెండి సింహాల ప్రతిమలు మాయం అయినట్టు గుర్తించిన పోలీసులు

-జూన్ 29న మిగిలిన రెండు వెండి సింహాలు దొంగిలించే ప్రయత్నంలో మరో వెండి సింహం ప్రతిమ అదృశ్యం అయినట్లు గుర్తించిన పోలీసులు

Tags:    

Similar News