Constipation: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? ఉదయాన్నే ఈ ఆహారాలు తింటే మీ పొట్ట క్లీన్
Constipation: ఉదయం లేవగానే పొట్ట ఖాళీ అయితే, మీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ కొంతమందికి మలబద్ధకం సమస్య వల్ల ఉదయం పనులు సరిగా జరగవు.
Constipation: ఉదయం లేవగానే పొట్ట ఖాళీ అయితే, మీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ కొంతమందికి మలబద్ధకం సమస్య వల్ల ఉదయం పనులు సరిగా జరగవు. గంటల తరబడి టాయిలెట్లో కూర్చున్నా సరిగా మలవిసర్జన కాదు. ఇది ఒకరిద్దరి సమస్య కాదు, ఈ మధ్య కాలంలో ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మలబద్ధకం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా రకాల మందులు, సిరప్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి తీసుకున్నంత సేపు మాత్రమే ఉపశమనం లభిస్తుంది. దానికి బదులుగా ఈ సమస్యను సహజంగా తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.
ఎండు ద్రాక్ష నీళ్లు
ఎండు ద్రాక్షను చాలామంది తిని ఉంటారు. అందులోనూ నల్ల ఎండు ద్రాక్ష మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. 4 లేదా 5 నల్ల ఎండు ద్రాక్షలను శుభ్రం చేసి ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం ఆ నీటిని తాగండి. ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నీటిలో నానబెట్టడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగుల కదలిక మెరుగవుతుంది. ఎండు ద్రాక్షలో సార్బిటాల్ అనే సహజ సమ్మేళనం ఉంది. ఇది మలాన్ని మెత్తగా చేసి విసర్జనను సులభతరం చేస్తుంది. నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.
గోరువెచ్చని నీటితో నెయ్యి
జీర్ణక్రియ సమస్యలను తొలగించడానికి గోరువెచ్చని నీరు సహాయపడుతుంది. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలని సిఫార్సు చేస్తారు. కానీ జీర్ణక్రియ సమస్య ఉన్నవారు ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తాగడం చాలా మంచిది. ఇది పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
కివి పండు
ఈ పండు అందరికీ నచ్చదు. కానీ మలబద్ధకం వంటి సమస్యను తగ్గించడానికి ఈ పండు సహాయపడుతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం కొన్ని రోజుల పాటు రోజుకు 1 లేదా 2 కివి పండ్లను తింటే, అందులో ఉండే కరిగే, కరగని ఫైబర్ మలాన్ని మెత్తగా చేసి పొట్టను శుభ్రపరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య నుండి విముక్తి లభిస్తుంది.
మలబద్ధకం తగ్గించడానికి ఏమి చేయాలి?
ఈ సమస్య మీరు అనుకున్నంత సాధారణమైనది కాదు. ఇది పెరిగితే, పైల్స్, పగుళ్లు వంటి అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి, మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చూసుకోవాలి. ఇందుకోసం మనం ప్రతిరోజు పోషకాహారం తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినాలి.. తగినంత నీరు తాగాలి. వీటితో పాటు కొద్దిగా వ్యాయామం కూడా చేయాలి. మలబద్ధకానికి చాలా మందులు ఉన్నాయి. కానీ ఆహారం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం వల్ల సమస్యను మూలం నుండి నివారించవచ్చు. అంతేకాకుండా దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.