ఎమ్మెల్యే 36 గంటల ఉక్కుదీక్ష

Update: 2019-02-13 08:27 GMT

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ దీక్షకు దిగారు. ఈ దీక్షా శిబిరాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యకార్యకర్తలు హరిప్రియ దీక్షకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని నేతలు మండిపడ్డారు. వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 13వ షెడ్యూల్‌లో పొందుపరిచిన విధంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. 

Similar News