లైవ్ అప్డేట్స్: జనసేన ఎమ్మెల్యే జంప్ అవుతారా..తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు

⇒జనసేన పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గతకొంతకాలంగా ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Update: 2019-12-04 04:43 GMT

    జనసేన పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గతకొంతకాలంగా ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ఆయన అవసరం లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైసీపీలో కీలకనేతలు, మంత్రులతో సన్నిహితంగా మెలుగుతున్నారు. --పూర్తి వివరాలు 

 షాద్‌నగర్‌లో వెటర్నరీ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కొందరంటుంటే, వారిని బహిరంగంగా ఉరి తీయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. --పూర్తి వివరాలు 

⇒ ఓ వైపు ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీరు తెప్పిస్తుంటే..మరోవైపు టమోటా ధరలు కూడా చలికాలంలో వేడిపుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ కిలోకు రూ. 25 వరకూ ధర పలికిన టమోటా, ఇప్పుడు ఏకంగా రూ. 50కి చేరింది. --పూర్తి వివరాలు 

 తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం వార్డులు/డివిజన్ల విభజన ప్రక్రియకు సంబంధించిన 14 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించింది ప్రభుత్వం. --పూర్తి వివరాలు 

 వెస్టిండీస్ - టీమిండియాల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ కి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సిద్ధం అయింది. ఈ నెల 6 న ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. --పూర్తి వివరాలు

 చింతపల్లి: వింత వ్యాధి సోకి గడచిన మూడు వారాలలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని అన్నవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో చోటుచేసుకుందని అన్నవరం తాజా మాజీ సర్పంచ్ సుండ్రు నాగజ్యోతి , వైకాపా నాయకుడు యస్. చిన్నబ్బాయిలు ఒక ప్రకటనలో తెలిపారు.--పూర్తి వివరాలు

Tags:    

Similar News