G7 సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబోట్‌లు

* భారతీయులను నమస్తే అంటూ పలకరించిన రోబోట్

Update: 2023-05-21 06:08 GMT

G7 సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబోట్‌లు 

Japan: జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న G7సమ్మిట్‌లో రోబోట్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇంటర్నేషనల్ మీడియా సెంటర్‌లో ఉన్న భారతీయులను ఓ రోబో నమస్తే అంటూ పలకరించింది. జపాన్ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలని కోరింది. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు రోబోట్ సమాధానాలు ఇచ్చింది. అణ్వాయుధాల నిరాయుధీకరణే ప్రధాన లక్ష్యంగా ఈ సారి G7 సమ్మిట్‌ జరిగింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరైయ్యారు.  

Tags:    

Similar News