అమెరికా చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం : కమలా హారిస్

Update: 2020-11-08 05:23 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత డెమొక్రాట్లు తొలి విజయోత్సవ సభ నిర్వహించారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ రికార్డు సృష్టించారు. దీంతో భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డెమొక్రాట్ల తొలి విజయోత్సవ సభలో అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్‌ ప్రసంగించారు. అమెరికా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు హారిస్. అమెరికా చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయమన్నారు కమలా.

Tags:    

Similar News