China: చైనాలో ఒక్కసారిగా కదిలిన భారీ భవంతి

China: షెక్ అయిన 980అడుగుల ఎస్ఈజీ ప్లాజా * ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు

Update: 2021-05-19 11:56 GMT

చైనాలోని ఎస్ఈజీ ప్లాజా (ఫైల్ ఇమేజ్)

China: ఉన్నట్టుండి దాదాపు వెయ్యి అడుగులు ఎత్తైన బిల్డింగ్ కదిలితే.? ఆ భవనం కింద ఉన్నవారి పరిస్థితేంటి? చైనాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ భారీ బిల్డింగ్ ఒక్కసారిగా షేక్ అవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు అక్కడి ప్రజలు. 980అడుగుల ఎత్తైన భవనం ఎస్ఈజీ ప్లాజా హఠాత్తుగా వణికింది. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేశారు. భూకంపాల పర్యవేక్షక స్టేషన్ల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించిన అధికారులు భూకంపం లాంటిది ఏదీ సంభవించలేదని తేల్చేశారు. అయితే ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో భవంతిలోని ప్రజలను ఖాళీ చేయించారు.

Full View


Tags:    

Similar News