Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ లో ముగిసిన అమెరికా పోరు.. తిరుగుబాట పూర్తి!

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాయి. గత రాత్రి, 12 గంటల ముందు చివరి అమెరికన్ విమానాలు కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరాయి.

Update: 2021-08-31 04:33 GMT

ఆఫ్ఘనిస్తాన్ లో ముగిసిన అమెరికా పోరు (ట్విట్టర్ ఫోటో)

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగాయి. గత రాత్రి, 12 గంటల ముందు చివరి అమెరికన్ విమానాలు కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరాయి. దీనితో ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా యుద్ధం కూడా ముగిసింది. తాలిబాన్లతో ఒప్పందం ప్రకారం, ఆగస్టు 31 లోపు ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా వదులుకోవాల్సి ఉంది. కానీ అమెరికా ఇరవై నాలుగు గంటల క్రితం ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోయింది. కాబూల్ విమానాశ్రయం నుండి నాలుగు యుఎస్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలు సి -17 బయలుదేరడంతో, తాలిబాన్ ఫైటర్లు సంబరాలు చేసుకున్నారు. గాలిలో కాల్పులు జరుపుతూ విచిత్ర విన్యాసాలు చేశారు.

కాబూల్ విమానాశ్రయం సమీపంలో నివసిస్తున్న ప్రజలు విమానాశ్రయంపై మరొక దాడి జరుగుతోందేమో అని భయపడెంత పేలుళ్లు జరిపారు తాలిబన్లు. తాలిబాన్ మద్దతుదారులు ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు.. ' అమెరికా పోయింది, యుద్ధం ముగిసింది.'

కాబూల్‌లోని తాలిబాన్ ప్రతినిధి అమానుల్లా వాసిక్ ట్విట్టర్‌లో ఇలా అన్నారు: "కాబూల్ ప్రజలు, భయపడవద్దు, ఈ బుల్లెట్లు గాలిలో కలుస్తున్నారు. ముజాహిదీన్‌లు స్వాతంత్ర్యాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు.''

ఆఫ్ఘనిస్తాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించడానికి యుఎస్ ఖతార్ నుండి పనిచేస్తుంది

యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇలా చెప్పారు. ''ఈ రోజు మేము కాబూల్‌లో మా దౌత్య ఉనికిని రద్దు చేశాము. మా కార్యకలాపాలను ఖతార్ రాజధాని దోహాకు బదిలీ చేసాము. మేము ఆఫ్ఘనిస్తాన్‌తో దౌత్య సంబంధాలను కలిగి ఉండటానికి ఖతార్‌లోని దోహాలోని మా పోస్ట్‌ని ఉపయోగిస్తాము. యుఎస్ మిలిటరీ విమానాలు ఆగిపోయాయి. మా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుండి బయలుదేరారు.''

ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అమెరికా మానవతా సాయం అందిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వం ద్వారా కాదు, ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వేతర సంస్థల ద్వారా జరుగుతుందని అయన చెప్పారు. తాలిబాన్ లేదా మరే ఇతర సమూహం అయినా సరే మా ప్రయత్నాలకు ఆటంకం కలిగించదని మేము ఆశిస్తున్నామని అయన పేర్కొన్నారు.

Tags:    

Similar News