నన్ను చాలామంది టార్గెట్ చేస్తున్నారు...భద్రత పెంచండి!

Update: 2018-10-09 11:53 GMT

తనకు రక్షణ కల్పించాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే.. డీజీపీకి లేఖ రాశారు. తనను చాలామంది టార్గెట్ చేస్తున్నారని.. తనకు భద్రత పెంచాలంటూ లేఖలో పేర్కొన్నారు. గతంలో తాను ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే, బెదిరింపు లేఖలు వచ్చాయని డీజీపీకి తెలిపారు. రాజధానికి భూసమీకరణ, ఓటుకు నోటు కేసు, సీఎం అక్రమ నివాసం.. సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై పోరాటం గురించి కూడా ఎమ్మెల్యే ఆర్కే, తన లేఖలో ప్రస్తావించారు. 

Similar News