విశాఖ ఎయిర్ పోర్టులో దాడి ఘటనపై వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ ట్విట్టర్లో స్పందించారు. ప్రజల దీవెన, దేవుడి దయతో నేను క్షేమంగా ఉన్నానని, పిరికిపంద చర్యలతో నా లక్ష్యాన్ని దెబ్బతీయలేరని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను తనను భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.