జగన్ పాదయాత్రపై తేనెటీగల దాడి

Update: 2018-06-07 06:57 GMT

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కానూరు క్రాస్ రోడ్డు దగ్గర  పాదయాత్రగా వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ...టవాళ్లు అడ్డం పెట్టి యాత్ర కొనసాగించారు. తేనేటీగల దాడిలో పది మందికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదాయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

Similar News