లోటస్ పౌండ్ లో ప్రశాంత్ కిషోర్ టీంతో జగన్ భేటి

Update: 2018-04-06 10:03 GMT

వైసీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో తాజా పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు. ఐదుగురు ఎంపీల నిరాహార దీక్షల నేపధ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారిగా దీక్షలు,నిరసనలు నిర్వహించే అంశంపై చర్చించారు. దీంతో పాటు రాజీనామా చేసిన ఎంపీలతో ఫోన్లో మాట్లాడిన ఆయన ..ఇచ్చిన మాటకు కట్టుబడి రాజీనామా చేశారంటూ అభినందించారు. ఆమరణ నిరాహార దీక్ష నేపధ్యంలో భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేశారు.  
 
 

Similar News