ఆయన రాకతో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి: రోజా

Update: 2018-07-11 09:23 GMT

పోలవరం పనులు పరిశీలించేందుకు కేంద్రమంత్రి గడ్కరీ వస్తున్నారనగానే.. చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఏ కేంద్రమంత్రి వచ్చినా పట్టించుకోని బాబు.. గడ్కరీ వస్తున్నారన్నగానే.. కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులెవరినీ వెళ్లొద్దని చెప్పి తానే ముందు వెళ్లారన్నారు. దీనిని బట్టే పోలవరం పనుల్లో ఎన్ని అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు రోజా. చిత్తూరు జిల్లా ఎస్వీపురంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆర్కే రోజా ట్రస్టు ద్వారా సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు.

Similar News