వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే జరుగుతుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. కేసీఆర్ ఎటువైపు ఉంటే...అటు వైపు గెలుపు ఉంటుందని కవిత స్పష్టం చేశారు. మీడియాతో చిటిచాట్ నిర్వహించిన కవిత..పలు కీలక అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో భయంకరమైన ప్రతిపక్షముందని....ఇలాంటి ప్రతిపక్షం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం మంచి చేయాలని చూస్తుంటే...ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.