గుంటూరు జిల్లాలో వినాయక చవితి పండుగపూట విషాదం నెలకొంది. ప్రత్తిపాడు మండలం గనికపూడిలో వినాయక మండపం దగ్గర కరెంటు తీగ తగిలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి..కూతురు, కొడుకు ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన గనికపూడిలో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గనికపూడి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.