వైసీపీ ఎంపీలు... ప్రజల చెవుల్లో పెద్దపెద్ద పువ్వులు పెట్టారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఆరోపించారు. బీజేపీతో రాజీ... ప్రజలకు నామాలు పెట్టారంటూ వైసీపీ ఎంపీల రాజీనామాలకు కొత్త అర్ధం చెప్పారు. ఈ డ్రామా అంతా విజయసాయిరెడ్డి డైరెక్షన్లో జరుగుతోందంటున్నారు టీడీపీ ఎంపీ శివప్రసాద్. అందరూ బాగా నటించి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 1951 యాక్ట్ ప్రకారం ఇప్పుడు రాజీనామాలు ఆమోదించుకుంటే ఎన్నికలు జరగవని తెలిసే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని శివప్రసాద్ అన్నారు.