అసదుద్దీన్ వ్యాఖ్యలకు రామ్మోన్ నాయుడు కౌంటర్

Update: 2018-12-13 12:02 GMT

ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తనకు మంచి స్నేహితుడని ఏపీ వచ్చి జగన్ తరఫున ప్రచారం చేస్తానని వ్యాఖ్యానించిన ఎంఐఎం అసదుద్దీన్‌కు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఎక్కడైనా, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు. కానీ ఎక్కడైనా విబేధాలు రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని అన్నారు. అయితే ఎలాంటి సంబంధంలేని, అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ అసదుద్దీన్‌ ఒకసారి ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు. అసలు ఏపీలో టీడీపీకి ముస్లింల మద్దతు ఎంత ఉందో స్వయంగా ఆయనే చూస్తారని రామ్మోన్ నాయుడు అన్నారు.

Similar News