సూపర్స్టార్ మహేష్బాబు కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ 'స్పైడర్'. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. హేరిస్ జైరాజ్ సంగీతమందించిన ఈ సినిమా ఈ నెల 27న దసరా కానుకగా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 2,500 థియేటర్స్లో విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న 'స్పైడర్'.. యుఎస్ఎలో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్ని ప్రీమియర్స్కే సొంతం చేసుకుంది.