జగన్‌ పాదయాత్రకు స్మాల్‌ బ్రేక్‌

Update: 2018-01-19 05:55 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుండగా గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.

Similar News