నా ఆస్తి మొత్తం రాసిస్తా : శివాజీరాజా

Update: 2018-09-03 07:57 GMT

 సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో సోమవారం  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యవర్గం స్పందించింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా  మాట్లాడుతూ..  నా పిల్లల మీద ఒట్టు..నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని నిరూపిస్తే నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తాను.’ మా అసోసియేషన్‌ డబ్బులతో  ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని, ఫోన్‌ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు. ‘మా’ ఎన్నికల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారని, వాళ్లు తాము చేసే ప్రతి పనిని తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన నిధులు దుర్వినియోగ ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. మా అసోసియేషన్‌ జూబ్లీ ఇయర్‌ సందర్భంగా నూతన బిల్డింగ్‌ కట్టబోతున్నామని.. దీని కోసం మెగాస్టార్‌ చిరంజీవిని కలిస్తే ఆయన రెండు కోట్ల డొనేషన్‌ ఇస్తానని, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చినట్టు శ్రీకాంత్ చెప్పారు. 

Similar News