నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2018-01-14 06:42 GMT

పండగపూట  పొగమంచు ఓ ఇంట విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లాలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో తమిళనాడు రాష్ట్రంలోని వేళంగిని దేవాలయానికి వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎన్టీఆర్ నగర్ దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. కాగా... సమాచారమందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. 

Similar News