టీడీపీ, వైసీపీపై మరోసారి పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదా సాధనలో రెండు పార్టీలకూ చిత్తశుద్ధి లేదనిపిస్తోందని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానాలపై ఇంత గందరగోళం ఎందుకన్న పవన్ ఇంత హడావిడిగా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశంపై తెదేపా, వైకాపా నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అవిశ్వాస ను పెట్టే అంశంలో రెండు పార్టీలు తేదీలను ముందుకు, వెనక్కి జరుపుతున్నాయన్నారు. అవిశ్వాస తీర్మానంపై తెదేపా, వైకాపా ఒక్కటయ్యాయని అంటున్నారని.. అక్కడే వారి కుమ్మక్కు అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు.