టీడీపీపై పవన్ ట్వీట్ వార్...టీడీపీని గజని సినిమా హీరోతో పోల్చిన పవన్

Update: 2018-07-21 05:24 GMT

టీడీపీ నేతలపై పవన్ ట్విట్టర్‌లో విరుచుకుపడుతున్నారు. అవిశ్వాసం చర్చ ముగిసిన తర్వాత టీడీపీపై జనసేనాని ట్వీట్ వార్ ప్రారంభించారు. టీడీపీని గజని సినిమా హీరోతో పోల్చిన పవన్ టీడీపీ నేతలకు మతిమరుపు జబ్బు సోకినట్లుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అంశంలో టీడీపీ గజనిలా ప్రవర్తిస్తోందన్నారు. మొన్నటి వరకు ప్యాకేజీ అన్న టీడీపీ నేతలు ఇప్పడు హోదా అంటున్నారనీ మళ్ళీ మాట మార్చరనే గ్యారెంటీ ఉందా అని పవన్ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు ఏపీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి పవన్ ట్వాట్టర్‌లో కామెంట్ చేశారు.

Similar News